21 సెప్టెం, 2011

 

 

 

 

                              chandrima



             జ్ఞాన పీఠము తెచ్చినారము జ్ఞానులెవ్వరొ 

 

 

తెలుపుడీ!

2 అక్టోబర్, 2008

kmcmohan చే

కొంత కాలంక్రితం 


ఒక పెళ్ళికని మా వూరు (చిత్తూరు) వెళ్ళాను.


పెళ్ళి భోజనాల తరువాత 


బంధు జనులందరూ కూర్చొని పిచ్చా పాటీ 


మాట్లాడుకొంటున్నాము. 


మాటల సందర్భంలో ఒకరు; 


తమిళ, తెలుగు, ఆంగ్ల భాషల్లో విశేష కృషి చేసిన వారు, 


ఒక ప్రశ్న అడిగారు. 



“జ్ఞాన పీఠ అవార్డు ఇవ్వడానికి 


తెలుగు భాషను పరిశీలించే సమయం వచ్చింది. 


ఐతే మిమ్మల్ని ఒక పేరు ప్రతిపాదించమని అడిగితే



 మీరెవరి పేరు చెబుతారు?” 


హఠాత్తుగా ఒక ఇబ్బందికరమైన నిశ్శబ్దం. 


ఎవరికీ మాటలు దొరకలేదు.


“ఈసారీ అర్హులు ఎవరూ లేరని తెలుగును 


దాటవేస్తారేమో” 


అన్నారు ఒకరు మెల్లగా. 


మరణావస్థలోనున్న తెలుగు సాహిత్య ఆత్మ శాంతికా 

అన్నట్లు


కొన్ని క్షణాల మౌనం తరువాత 


మెల్లగా సంభాషణ తమిళ సాహిత్యం వైపు మళ్ళింది. 


అక్కడున్నవారిలో పలువురు ఉభయ భాషాభిమానులు 


కావడంతో 


అవార్డు తెలుగు కవికి వచ్చినా, 


తమిళ కవికి వచ్చినా వారికి సంతోషమే.



ఇన్ని రోజులు గడిచినా 


ఆ ప్రశ్న నా మనసులోనుండి తొలగి పోలేదు.


 “జ్ఞాన పీఠ అవార్డు కు ఒకరి పేరు చెప్పమంటే 


నేనెవరి పేరు చెప్పాలి?” .


ఆఖరు సారిగా సినారె కు వచ్చింది. 


అప్పుడు నాకు నచ్చలేదు. 


పుట్టపర్తి వారికి వస్తుందని నాకు నమ్మకంగా ఉండేది. 


అవార్డు ప్రకటించిన కొన్ని రోజులకు 


నేను పుట్టపర్తి నారాయణాచార్యుల వారిని 


వారి యింటిలో కలవడం జరిగింది. 


వారికి కూడా కొంత నిరాశ కలిగిన మాట వాస్తవం.


“ అవార్డు గురించే కాదు గానీ, 


వారిచ్చే లక్ష రూపాయలతో 


నా ఆధ్యాత్మ రామాయణం అచ్చయిపోయేది. 


మరో సారి తెలుగు వంతు వచ్చేదాకా 


నేను బ్రతికిఉండే అవకాశం లేదు” అన్నారు. 


మరో రెండేళ్ళకే వారు దివంగతులయ్యారు.

విశ్వనాధ వారికి అవార్డు వచ్చినప్పుడు 


ఎవరికీ ఆక్షేపణలు లేకపోయినా, 


అంతటి గొప్ప సమకాలికులు ఆయనకు చాలామందే 


ఉండేవారు


 – శ్రీశ్రీ, జాషువా, వారి గురువు చెళ్ళపిళ్ళ వారు, 


కృష్ణశాస్త్రి, తిలక్, … ఇంకా బోలెడంతమంది. 


అదేమి వింతయో గానీ 


భూమిపైనుండి డైనోసార్లు హఠాత్తుగా 


అంతరించిపోయినట్లు 


తెలుగు సాహితీ లోకంనుండి 


కవికులం చడీ చప్పుడు లేకుండా అదృశ్యమైపోయింది. 


పద్య కవితలు పోతే పోయె, 



మంచి వచనమో, 


కనీసం చక్కని సాహితీ విలువలతో కూడిన నవలా 


సాహిత్యమో 



సృజించేవారు కరువైపోయారు.


ఈ మధ్య కాలంలో 



జ్ఞాన పీఠ అవార్డుకు ఖచ్చితంగా అర్హులైన వారని 



నేను భావించే కరుణశ్రీ,  


గుంటూరు శేషేంద్ర శర్మ గారు,  


మధురాంతకం రాజారాం గారు … 


అందరూ కీర్తిశేషులైపోయారు. 


జ్ఞాన పీఠ అవార్డును 


మరణానంతరం ఇచ్చే సాంప్రదాయం లేదాయె. 


ఇక మిగిలిందెవరు?

తెలుగు సాహితీ లోకంలో 


ప్రస్తుతం భయంకరమైన శూన్యం తాండవిస్తోంది. 


ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి


‘ తెలుగులో అవార్డు ఇచ్చి చాలా రోజులైపోయింది. 


ఇదిగో జ్ఞాన పీఠం, తీసుకోండి’ అంటే 


తీసుకోగలవారు కనిపించడంలేదు.

“ ముద్దుగ గండపెండియరమున్ గొనుడంచు 


బహూకరింపగా
 


నొద్దిక నాకొసంగుమని యొక్కరు కోరగలేరు, లేరొకో! 

అని ఒకనాడు శ్రీకృష్ణ దేవరాయల వారు బాధపడి 


పోయారు. 


ఆ క్షణాన వారికి ఓదార్పునిస్తూ

“ పెద్దన బోలు సత్కవులు పృధ్విని లేరని నీవెరుంగవే!
 


పెద్దనకీదలంచినను పేర్మిని నాకిడు కృష్ణరాణృపా ”


అని చెప్పడానికి ఓ పెద్దనామాత్యుడు ఉన్నాడు.


నేడెవరున్నారు?

పుట్టపర్తి నారాయణాచార్యులు

వికీపీడియా నుండి
Broom icon.svgఈ వ్యాసం యొక్క ప్రధాన వస్తువు పరిచయము లేని వారికి వ్యాసం యొక్క పరిచయం లేదా ప్రవేశిక అరకొరగా ఉన్నది.
ప్రవేశికను వికీపీడియా ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచటానికి సహాయం చెయ్యండి. దీని గురించి చర్చాపేజీలో చర్చించవచ్చు.

వేపచేదు వెబ్ సైటు నుంచి
ఉపోద్ఘాతం-
"ఏమానందము భూమీతలమున
శివతాండవమట శివలాస్యంబట..."
అవును
ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త, తెలుగు సాహితీకారులలో అగ్రగణ్యుడు, బహుబాషా కోవిదుడు పుట్టపర్తి నారాయణాచార్యులు. నారాయణాచార్య విరచితమైన ఆ కావ్యం చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదు. కనురెప్ప వాల్చనీయదు. ఆ కావ్యంలో ఆయన సాధించిన లయాత్మక సౌందర్యం అనితరసాధ్యం. అందుకే ఆ కావ్యాన్ని ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణిస్తారు.

జీవిత విశేషాలు

పుట్టపర్తి నారాయణాచార్యులు 1915మార్చి, 28 వ తేదీన అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడుగ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. కృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది.
నారాయణాచార్యులు చిన్న వయసులోనే భారతంభాగవతం, పురాణాలతో పాటు సంగీతం కూడా నేర్చుకున్నారు. ఆయనతిరుపతి సంస్కృత కళాశాలలో సంస్కృతం నేర్చుకున్నారు. కపిలస్థానం కృష్ణమాచార్యులు, డి.టి. తాతాచార్యులు లాంటి గొప్ప సంస్కృత పండితుల వద్ద వ్యాకరణంఛందస్సు, తదితరాలు నేర్చుకున్నారు. పెనుగొండలో రంజకం మహాలక్ష్మమ్మ దగ్గర భరత నాట్యం నేర్చుకున్నారు. సంగీతం, సాహిత్యం, నాట్యం ఆయనలో త్రివేణీ సంగమంలా మిళితమయ్యయి. చిన్నప్పుడు నాటకాల్లో ఆడవేషాలు వేయడమే గాక సన్నివేశాల మధ్య తెర లేచేలోపు నాట్యం చేసే వారు.
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. అప్పటికింకా స్వాతంత్ర్యం రాలేదు. ఆ కళాశాల ప్రిన్సిపాల్ మీనన్ కి సమయం దొరికితే చాలు, ఆంగ్లేయుల్ని తనివితీరా పొగడడం, గాంధీ వంటి వారిని తిట్టడం పరిపాటిగా ఉండేది. అది సహించలేని పుట్టపర్తి ఆయనతో వాగ్యుద్ధానికి సిద్ధపడడమే గాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరు లోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది.
ఆయన బహుభాషావేత్త, అనేక భాషల్లో పండితులు. తుళుఫ్రెంచిపర్షియన్ లాంటి 14 భాషలు నేర్చుకున్నారు. హృషీకేశ్ లో ఆయన పాండిత్యాన్ని పరీక్షించిన శివానంద సరస్వతి ఆయనకు "సరస్వతీపుత్ర" బిరుదునిచ్చారు. ఆయనకు లెక్కలేనన్ని సత్కారాలు జరిగినా, ఎన్ని బిరుదులు వచ్చినా ఈ ఒక్క బిరుదునే గొప్ప గౌరవంగా భావించి ఆయన ఉంచుకున్నారు.
పుట్టపర్తి ఆనేక ప్రసిద్ధ తమిళకన్నడమలయాళమరాఠీ కావ్యాలను తెలుగులోనికి అనువదించారు."లీవ్స్ ఇన్ ది విండ్", దుర్యోధనుడి కథ ఆధారంగా వ్రాసిన "ది హీరో" ఆంగ్లంలో ఆయన స్వంత రచనలు. ఆయన ఆంగ్లంలో మరిన్ని రచనలు చేసి ఉండేవారే. ఆయనకు ఆంగ్లం నేర్పిన వి.జె. పిట్ అనే దొరసాని అప్పటి పెనుగొండ సబ్ కలెక్టర్ భార్య. ఆమె కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో బ్రౌనింగ్ పై రీసెర్చ్ చేసి డాక్టరేట్ పొందింది. అప్పట్లోనే ఈయన వ్రాసిన లీవ్స్ ఇన్ ది విండ్ కావ్యం చూసి హరీంద్రనాథ్ చటోపాధ్యాయ పెద్ద కితాబు ఇచ్చారు.
అయితే పిట్ దొరసాని మాత్రం "ఇంగ్లీషులో వ్రాయడానికి అనేక మంది ఇండియన్స్ ప్రయత్నించి ఫెయిలైనారు. మీరెంత కష్టపడినా మిమ్మల్ని క్లాసికల్ రైటర్స్ ఎవరూ గౌరవించరు. అందుకే బాగా చదువుకో. కానీ ఇంగ్లీషులో వ్రాసే చాపల్యం పెంచుకోవద్దు." అని చెప్పింది. దాంతో ఆయన చాలా రోజులు ఆ ప్రయత్నమే చేయలేదు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి భాగవతాన్ని ఇంగ్లీషులోకి అనువదించడంతో బాటు ది హీరో నాటకాన్ని వ్రాశారు. కథంతా స్వీయ కల్పితమే.
ఆయన చరిత్రను ఎంత లోతుగా అధ్యయనం చేశాడంటే చరిత్రకారులకు ఆయన్ను పట్ల గొప్ప గౌరవముండేది. ఒకసారి ఆయనకు కమ్యూనిస్టులు సన్మానం చేసినప్పుడు ఆంధ్రుల చరిత్రలో గాఢమైన అభినివేశమున్న మల్లంపల్లి సోమశేఖరశర్మ "ఆయన్ను కవిగా కంటే చారిత్రకునిగా గౌరవిస్తానని" సందేశం పంపాడు. తర్వాత పుట్టపర్తి చారిత్రకులను ఇరుకున పెట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకసారి అనంతపురం కళాశాలలో చరిత్ర అధ్యాపకుణ్ణి ఒకరిని ఒక శాసనం గురించి ప్రస్తావిస్తూ "సంపెట నరపాల సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశిల జేర్చునాడు అని ఉంది కదా వీడెవడు ఈ సంపెట నరపాల గాడు?" అని అడిగి, ఆయన దిగ్భ్రాంతుడై నిలబడి పోతే, తనే సమాధానం చెప్పాడు~: "కృష్ణదేవరాయలేనయ్యా, వాళ్ళ వంశం తుళు వంశం, ఇంటివాళ్ళు సంపెట వాళ్ళూ" అని.
భారత ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారాన్నిచ్చింది. ఆయితే ఆయన నిజానికి జ్ఞానపీఠ అవార్డు పొందడానికి అన్నివిధాలా అర్హులనీ, ఆయనకు ఆ అవార్డు రాకపోవడం తెలుగువారి దురదృష్టమనీ పలువురు పండితులు భావిస్తారు. గుర్రం జాషువా"పుట్టపర్తి నారాయణాచార్యుల కంటే గొప్పవాడెవ్వడు?" అని ప్రశ్నించాడు. దేశంలోని అన్ని ప్రాంతాలలో, హైదరాబాదుచెన్నై,కలకత్తా లాంటి అన్ని నగరాలలో ఆయన సత్కారాలు పొందారు. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి. ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.
వీరి కాంశ్య విగ్రహం ప్రొద్దుటూరు పట్టణంలో 2007 సంవత్సరంలో ప్రతిష్టించబడినది.[1]

రచనలు

కేవలం పన్నెండేళ్ళ వయసులోనే విజయనగర రాజుల రెండవ రాజధాని ఐన పెనుగొండ దీనావస్థను చూసి హృదయం ద్రవించేలా "పెనుగొండ లక్ష్మి" అనే గేయ కావ్యం రాశాడు. చిత్రంగా తర్వాత ఆయన విద్వాన్ పరీక్షలు వ్రాసేటప్పుడు తాను చిన్నతనంలో వ్రాసిన ఈ కావ్యాన్నే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక కమనీయ ఘట్టం. చమత్కారమేమిటంటే ఆ పరీక్షలో ఆయన ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. దానికి కారణం "పెనుగొండ లక్ష్మి" కావ్యం నుంచి వచ్చిన ఒక రెండు మార్కుల ప్రశ్నను ముందుగా మొదలు పెట్టి ఆ ఒక్క సమాధానమే 40 పేజీలు వ్రాస్తూఉండిపోవడంతో సమయం అయిపోవడం. ఆ ప్రశ్నకు "పూర్తి" మార్కులు (అంటే 2 మార్కులు) వచ్చినా ఆ మార్కులతో ఆయన పాస్ కాలేకపోయారు. ఆయన బడికి వెళ్ళే రోజుల్లోనే షాజీ, సాక్షాత్కారము అనే కావ్యాలు వ్రాశారు.
తాను కేరళ విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు విశ్వనాథ సత్యనారాయణ నవల ఏకవీర ను మలయాళం లోనికి అనువదించాడు. పండితులు ఒకరి పాండిత్యాన్ని మరొకరు మెచ్చరని అంటారు. కాని పుట్టపర్తివారి విషయంలో మాత్రం దీనికి విరుద్దం. ఒక సారి విజయవాడలో పుట్టపర్తి తన "శివతాండవం" గానం చేసినప్పుడు విశ్వనాథ సత్యనారాయణ ఆనంద పరవశుడై ఆయనను భుజాలపైన కూర్చోబెట్టుకుని ఎగిరాడు. ఇంకొక సారి వైజాగ్ యూనివర్సిటీలో ప్రాకృత భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఉపన్యాసం ఐపోయాక ప్రాకృత భాషలలో పాండిత్యం గల పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి సభికులలో నుంచి వచ్చి పుట్టపర్తికి సాష్టాంగనమస్కారం చేశారు.
తెలుగులో ఆయన వ్రాసిన "శివతాండవం" ఆయనకు ఎనలేని కీర్తిప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దీనిని అనేకమంది పండితులు ఆధునిక మహా కావ్యంగా అభివర్ణిస్తారు. ఇది ఆరు భాగాలుగా ఉంది. దేశవ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ శివతాండవం గానం చేయమనే వారు. తెలుగు అర్థం కాని వారు సైతం ఆ మాత్రాచ్ఛందస్సు లోని శబ్దసౌందర్యానికి పరవశులయ్యేవారు. ఆయన గాత్ర మాధుర్యం ఎటువంటిదంటే శివతాండవాన్ని ఆయన స్వయంగా గానం చేయగా విన్న వాళ్ళు "ఆ శివుడు ఆడితే చూడాలి-ఆచార్యులవారు పాడితే వినాలి" అని భావించేవారు. మచ్చుకు  : కైలాసశిఖర మల గడగి ఫక్కున నవ్వ నీలిమాకాశంబు నిటలంబుపై నిల్వ నందికేశ్వర మృదంగ ధ్వానములు బొదల తుందిలా కూపార తోయపూరము దెరల చదలెల్ల కనువిచ్చి సంభ్రమత దిలకింప నదులెల్ల మదిబొంగి నాట్యములు వెలయింప వన కన్యకలు సుమాభరణములు ధరియింప వసుధ యెల్లను జీవవంతంబై బులకింప ఆడెనమ్మా శివుడు ! పాడెనమ్మా భవుడు!
ఆయన 140 పైగా గ్రంధాలు రచించారు. అందులో నవలలు, నాటకాలు, కావ్యాలు, సాహిత్య విమర్శనము, చారిత్రక రచనలు మొదలైనవి ఉన్నాయి. ఇటీవల ఆయన రచనల్లో కొన్ని "వ్యాసవల్మీకం", మహాభారత విమర్శనము (2 భాగాలు), ప్రాకృత వ్యాసమంజరి, స్వర్ణగేయార్చనం (సతీమణి కనకమ్మ తో కలిసి రచించిన భక్తి గీతమాల) మొదలైనవి ప్రచురితమయ్యయి.

ఆయన వ్రాసిన అనేక కృతుల్లో కొన్ని దిగువ ఇవ్వబడినవి.
తెలుగులో స్వతంత్ర రచనలు.
పెనుగొండ లక్ష్మి, షాజీ, మేఘదూతము, సాక్షాత్కారము, పండరీ భాగవతమ్ (ఓరియంటల్ లిటరరీ అవార్డ్), శ్రీనివాస ప్రబంధమ్, ఆగ్నివీణ, ప్రబంధ నాయకులు, పాద్యము, సిపాయి పితూరీ, గాంధీ ప్రస్థానం, క్రాంతి సందేశం, అనురాగం, ఆశ, స్మృతి, ఓదార్పు, ఎడబాటు, వీడుకోలు, ఆంధ్ర భారతోపన్యాసాలు, భాగవతోపన్యాసాలు, రామకృష్ణుని రచనా వైఖరి, వసుచరిత్ర విమర్శనమ్, విజయనగర రాజ్య సాంఘిక చరిత్ర, మొదలైనవి 7,000 కృతులు
ఆంగ్లంలో స్వతంత్ర రచనలు
  • లీవ్స్ ఇన్ ది విండ్.
  • ది హీరో
మలయాళంలో స్వతంత్ర రచనలు
  • మలయాళ నిఘంటువు
సంస్కృతంలో స్వతంత్ర రచనలు
  • త్యాగరాజ స్వామి సుప్రభాతం.
  • చెన్నకేశవ సుప్రభాతం.
  • శివకర్ణామృతం

అనువాదాలు

  • హిందీ నుండి:కబీర్ గీతాలు(కబీర్ వచనావళి,ఎన్.బి.టి ప్రచురణ)
  • మరాఠీ నుండి:భగవాన్ బుద్ధ
  • మలయాళం నుండి:స్మశానదీపం
  • మలయాళం లోకి:ఏకవీర
  • ఇంగ్లిషు లోకి:భాగవతం

వ్యక్తిత్వం

నారాయణాచార్యులు అహంభావిగా కనిపించే ఆత్మాభిమాని. తన కవిత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే నేను వ్రాసే తరహా కవిత్వం వారికి నచ్చ లేదు అనుకుని ఊరుకునే వాడు. కానీ తనకు పాండిత్యం తక్కువంటే మాత్రం సహించే వాడు కాదు. నిజంగా తన సాహితీ కృషికి అవసరమైన అంశాల్లో తనకు తెలియనిదేదైనా ఉంటే పట్టుదలతో నేర్చుకునే వాడు. అందుకే "నేను పెద్ద పండితుణ్ణి. ఇందులో సందేహం లేదు. నేను ఏ పరీక్షకు నిలబడడానికైనా తయారే. అయితే వినయపరుణ్ణి. నన్ను రెచ్చగొడితే మాత్రం భయంకరుణ్ణౌతా." అనేవాడు.
ఒకసారి ఆయన అనంతపురంలో జరిగిన సాహిత్యోపన్యాసాలకు వెళ్ళినప్పుడు కడపలో ఆల్ ఇండియా ఓరియెంటల్ కాన్ఫరెన్స్ జరిగింది. గంటి జోగి సోమయాజి సభాధ్యక్షుడు. ఆ సభలో పుట్టపర్తి గురించి "ఆయనకు తెలుగు తప్ప ఏ భాషా రాదు. పధ్నాలుగు భాషలు వచ్చని ప్రచారం చేసుకుంటాడు." అని విమర్శలు చేశారు. ఆ రాత్రే తిరిగి వచ్చిన ఆయన మరునాడు సభకు వెళ్ళి "14 భాషల్లో ఎవరు ఏ భాషలో నైనా ఏ ప్రశ్నైనా వేయవచ్చు.మీరు అడగండి. ఏ భాషలోనైనా సరే ఆశు కవిత్వం చెబుతాను." అని సాహిత్యంలో అహంకారం అనే విషయం మీద రెండున్నర గంటలు మాట్లాడి "నాకు అహంకారముంది. దీంట్లో న్యాయముంది." అన్నారు.

ప్రముఖుల అభిప్రాయాలు

  • పుట్టపర్తి వారిలాగ బహుభాషల్లో, బహుశాస్త్రాల్లో పండితులైన వారు, కవిత్వంతో బాటు విమర్శనారంగంలో కూడా అనన్యమైన ప్రతిభ చూపిన వారు నేటితరంలో కనిపించరు. జ్ఞానపీఠం వంటి గౌరవానికి వారు నిజంగా అర్హులు. కానీ అది తెలుగువారి దురదృష్టం వల్ల వారికి లభించలేదు. -భద్రిరాజు కృష్ణమూర్తి
  • శివతాండవం విన్నప్పుడు తుంగభద్రాప్రవాహంలో కొట్టుకు పోతున్నట్లనిపించింది. తర్వాత మేఘదూతం చదివాను. ఇది నా దృష్టిలో శివతాండవం కంటే గొప్ప రచన. -రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
  • ఆధునిక సారస్వతమున శివతాండవం వంటి గేయకృతి ఇంకొకటి లేదు. -తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
  • కవిత్వాన్నీ, పాండిత్యాన్నీ కలగలిపి ఔపోశన పట్టిన అగస్త్యుడు. -సి. నారాయణ రెడ్డి
  • ఎవని పదమ్ములు శివ తాండవ లయాధిరూపమ్ములు
ఎవని భావమ్ములు సుందర శివాలాస్య రూపమ్ములు
అతడు పుట్టపర్తి సూరి! అభినవ కవితా మురారి!!
...
పుట్టపర్తి ధిషణకు జైకొట్టగ మనసాయె నాకు.
కలితీ కనరాని క్షీరకళలు చిలుకు అతని పలుకు
వెలితి ఎరుగలేని కడలి పొలుపు తెలుపు అతని తలపు
వ్యవహారాజ్ఞత అంటని వైదిక జాతకుడాతడు
రక్తికి భక్తికి సేతువు రచియించిన రసికుడతడు!!! -సి. నారాయణ రెడ్డి

మూలాలు

బయటి లింకులు


జాను తెనుగు సొగసులు గారికి
నేను మీ బ్లాగునుంచీ ఈ భాగాన్ని తీసుకున్నందుకు క్షమించండి
అందుకు కృతజ్ఞతలు
బ్లాగు మొదలు పెట్టిన మొదట్లో మా అయ్యవి ఎక్కడ దొరికినా తీసుకున్నాను
కనీసం కృతజ్ఞతలైనా చెప్పలేదు
క్షమించండి..




Saakshi


బుధవారం :
21/09/2011

కాలానికి కవితా సేతువు!
అది తిరుపతిలోని మధురాంతకం రాజారాంగారి ఇల్లు.
 కథకుడు, విమర్శకుడు వల్లంపాటి వెంకటసుబ్బయ్య
ఆనాటి రాత్రి అక్కడ ఆతిథ్యం పొందుతున్నారు.
 భోజనానంతరం, వల్లంపాటివారు ఓ కావ్యం
చదవడం మొదలుపెట్టారు. అంతలో కరెంట్ పోయింది.
వల్లంపాటి కవితాగానం మాత్రం ఆగలేదు.
మధురాంతకంవారి సతీమణి ఆశ్చర్యపోయారు.
 ‘చీకట్లో ఎట్ల చదువుతున్నారన్నా?’ అని అడిగారు.
‘ఈ కావ్యం అచ్చులో చూసి చదవాల్సిన పనిలేదు -
 అది నా నాలుకమీద నర్తిస్తూనే ఉంటుందమ్మా!’
 అన్నారు వల్లంపాటి. ఆ కావ్యం ‘శివతాండవము’.
 దాన్ని రాసింది
 ‘సరస్వతీపుత్ర’ పుట్టపర్తి నారాయణాచార్యులు. ‘సుకవి జీవించు ప్రజల నాలుకలపైన’
 అన్న జాషువ వాక్యానికి ఇంతకన్నా నిర్ధారణ వేరేం కావాలి?

పాత కొత్తలకు వంతెన
భావకవితా మారుతం ఆంధ్రదేశమంతటా వీస్తున్న రోజులలో, వీస్తున్న
గాలి వెంట
 పోకుండా, ప్రబంధ శైలికి తాత్కాలికంగానే అయినా విరామం ఇచ్చిన వారు
 నారాయణాచార్యులు. ఆ విరామంలోనే సామాజిక చైతన్యాన్ని పురిగొల్పే
 రచనలు చేశారు. శ్రీశ్రీతో భుజం భుజం కలిపి తిరిగినవారు. అయినా ధ్వని
ప్రధానమైన ‘శివతాండవం’ రాశారు. ఆకృతిలో చిన్నదైన ఈ కృతి ఆయనకి
 విశేషమైన ఖ్యాతి తెచ్చిపెట్టింది. ఒక్క మాటలో చెప్తే ప్రాచీనతకూ, నవ్యతకూ
 సేతువు పుట్టపర్తి. మానవాళికి ఉండే ఆసక్తులన్నింటికీ ఆయనో ప్రతిబింబం.
 అలాంటి అన్ని ఆసక్తుల మీదా ఆయనకి ఆసక్తీ, అనురక్తి. అనంతమైన
అనుభూతులకు అక్షర రూపం ఇచ్చి వందకు పైగా సత్కృతులు రచించిన
 వారు నారాయణాచార్యులు. కవిత్వంతో పాటు విమర్శ, సమ్మోహన
వక్తృత్వం, బహు భాషా పరిచయం కలబోసుకున్న సాహితీ మేరువు.

విచిత్ర సన్నివేశం!
నారాయణాచార్యులవారు అనంతపురం జిల్లా చియ్యేడులో (28-3-1914)
 జన్మించారు. పెనుకొండలో తెలుగు పండితులు. అక్కడే ఉన్న
మహాలక్ష్మమ్మగారి వద్ద సంగీతం, నృత్యం కూడా నేర్చుకున్నారు.
 ఆయన పద్నాలుగో యేట రాసిన చిరు కావ్యం ‘పెనుగొండ లక్ష్మి’.
విశేషం ఏమిటంటే నారాయణాచార్యులు గారు మద్రాసు విశ్వవిద్యాలయం
 విద్వాన్ పరీక్షకు వెళ్లినపుడు ఇదే పుస్తకం పాఠ్యగ్రంథం.
తను రాసిన పుస్తకం మీద తానే పరీక్ష రాసిన విచిత్ర సన్నివేశం
 ఆయన జీవితంలో కనిపిస్తుంది. పుట్టపర్తి కేరళ విశ్వవిద్యాలయంలో
భాషా శాస్త్ర పరిశోధకులుగా పని చేస్తూనే విశ్వనాథ వారి ‘ఏకవీర’
నవలను మలయాళంలోకి అనువదించారు.

కన్నడ రచయిత బీచి రాసిన సరస్వతీ సంహార గ్రంథాన్ని తెలుగులోకి
అనువదించారు. సమర్థ రామదాసు రచనలను మరాఠీ నుంచి తె నిగించారు.
బుద్ధ భగవానుడు, వీర సావర్కర్, స్వర్ణపత్రము వంటి రచనలను కూడా
తెలుగులోకి అనువదించారు. ఆయన దేశమంతా తిరిగారు. బెనారస్
హిందూ విశ్వవిద్యాలయంలో కొన్ని ఉపన్యాసాలు ఇచ్చిన తరువాత
 ఆయన హృషికేశ్‌లోని స్వామి శివానందుల ఆశ్రమంలో కొంతకాలం
 ఉన్నారు. ఆ సమయంలో శివానందులు ఇచ్చిన బిరుదే ‘సరస్వతీపుత్ర’.

విరక్తి నుంచి విహాయసానికి..
ఎందుకోమరి, నారాయణాచార్యులు కొద్దికాలం విరక్తికి లోనైనారు.
అప్పుడే వారికి అత్యంత ప్రీతిపాత్రమైన విజయనగర చరిత్రను తనదైన
 శైలిలో గ్రంథస్తం చేస్తూ ప్రొద్దుటూరు సమీపంలోని ఒక గ్రామంలో ఉన్నారు.
 1948-49 ప్రాంతంలో కుందూ నదికి వరదలు వచ్చాయి. వారి పర్ణ
కుటీరం కూడా కుందూ ఆగ్రహానికి గురైంది. ‘అస్త సామ్రాజ్యం’ అన్న
 కావ్యం వరద పాలైంది. పాత విరక్తికి కొత్త విరక్తి తోడైంది. కావ్యం కుందూ
మింగేయడం ఆయనను బాగా బాధించింది.

అప్పుడే విశ్వంగారు పుట్టపర్తివారిని కలుసుకున్నారు. ‘‘అప్పా! నాకెందుకో
 ఈ మధ్య పద్యరచన చేయాలంటే అచ్చుబాటు కావడం లేదు. ప్రజల
 హృదయాల్లో నిలిచే కావ్య రచన చేయాలని ఉంది. దానికి తగ్గ వస్తువేదై
నా ఒకటి సూచించు!’’ అన్నారట పుట్టపర్తి. ‘‘స్వామీ! పద్యం కంటె మాత్రా
ఛందస్సులో గేయ రచన అయితే బాగుంటుంది.’’ అంటూ మొదట రూపాన్ని
 సూచించి, తరువాతే తన దృష్టిలో ఉన్న ఒక వస్తువును కూడా
నారాయణాచార్యులతో చర్చించారు విద్వాన్ విశ్వం. అదే ‘మేఘదూతము’గా
 తెలుగు సాహితీ వినీల వీధులలో విహరించింది. ఆచార్యుల వారి
 మేఘదూతము వారి అభ్యుదయ భావావేశానికి ప్రతీక. మానవతావాదా
న్ని ఎలుగెత్తి చాటిన గొప్ప గేయకావ్యం.

ఖైదీయే కావ్యనాయకుడు!
మేఘదూతము కావ్యానికి వస్తువుగా కడలూరు కారాగారంలో ఉండగా
తన అనుభవానికి వచ్చిన ఒక ఘట్టాన్ని విశ్వం సూచించారు. స్వాతంత్య్ర
 సమరయోధుడైన తోటి ఖైదీ జీవితంలోని వాస్తవగాథ అది. నవ
ప్రేమానురాగాలను అనుభవించవలసిన తరుణంలో అతడు కారాగారంలో
 బందీగా మిగిలిపోయాడు. కల్యాణం జరిగిన కొద్దినెలలకే ప్రభుత్వం
అతడిని కడలూరు జైలులో పెట్టింది. భార్యా వియోగమే కాదు,
పోలీసులు తన ఇంటిపై చేసిన దాడి, ప్రదర్శించిన దౌష్ట్యం,
బూటు కాళ్ల తాడనం వంటి చేదు జ్ఞాపకాలన్నీ ఆ యువ దేశభక్తుడి
ని నిరంతరం బాధించేవి. ఈ గాథ విని నారాయణాచార్యులు
కన్నీళ్లు పెట్టుకున్నారు. మాలతీ మాధవం నాటకంలోని ఘట్టాలు,
హంస సందేశం గుర్తుకు వచ్చాయి. కాళిదాసు మేఘ సందేశమూ
 తలపునకు వచ్చింది. భార్య, కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో
 అనుకుంటూ మేఘాలను చూస్తూ కాలం గడిపే కడలూరు ఖైదీ
 కావ్య నాయకుడిగా రూపుదిద్దుకున్నాడు.

నిత్య విద్యార్థి
నారాయణాచార్యులు అధిరోహించిన శిఖరాలు సమున్నతమైనవి.
ఆయన పొందిన సత్కారాలు కూడా ఎంతో ఎత్తయినవి. అయినా
అధ్యయనం ఆయన నిత్య జీవితంలో భాగంగానే కాపాడుకుంటూ
వచ్చారాయన. చివరికి జీవిత చరమాంకంలో కూడా ఆయన
 నిత్యం స్థానిక గ్రంథాలయానికి వెళ్లి చదువుకుంటూ, చదివిన
 విషయంలో ముఖ్యం అనుకుంటే రాసుకుని ఉంచుకుంటూ
కాలం గడిపారు. పుట్టపర్తి వారు కవిగా జన్మించారు. కవిగా
జీవించారు. చివరి వరకు సాహిత్యాన్నే శ్వాసించారు.
- డా. జానమద్ది హనుమచ్ఛాస్ర్తి


More Headlines



http://www.eemaata.com/em/features/essays/1060.html

స్నేహితుడు, విమర్శకుడూ

నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వల్లంపాటి వెంకట సుబ్బ య్య పోయారని. నిన్న మొన్ననే ఆయనతో చికాగోలో గంట ల తరబడి మాట్లాడాను. జంపాల చౌదరిగారి ఇంట్లో తెలుగు కథల గురించీ, తెలుగు విమర్శ గురించీ. ఆయన మాటలు, ఆయన గొంతుకా, ఆయన స్పష్టమైన ఆలోచనలు, విలక్షణమైన వాక్య ధోరణీ ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి. పొద్దున్న పనిమీద ఢిల్లీ వచ్చిన నన్ను అఫ్సర్‌ హైదరాబాద్‌ నుంచి పిలిచి, మీకో విచారకరమైన వార్త చెప్పాల్సివొస్తోంది-అని ఒక్కఅరక్షణం గడవకముందే వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు పోయారని అనగానే నేను నిర్ఘాంతపోయి ‘నిజమా’ అనడం గుర్తుంది కాని ఇప్పటికీ ఆ మాట నిజంలా వినిపించడం లేదు.
ఏదైనా వూహ కొస్తే, ఒక కథ గురించో, ఒక విమర్శా సిద్ధాంతం గురించో ఒక ఆలోచన వొస్తే అది వల్లంపాటి వినాలని, ఆయ న ఏమంటారో తెలుసుకోవాలని చటుక్కు న అనిపించేది. వెంకటసుబ్బయ్యగారు ఎ ప్పుడూ అందుబాటులో ఉండేవారుకారు. ఎక్కడో విసిరిపారేసినట్లు ఆ మూల వున్నారెందుకూ, ఆంధ్రదేశంలో ఏ విశ్వ విద్యాలయమూ అయన్ని పిలిచి ఎందుకు ఉద్యో గం ఇవ్వలేదెందుకు- అని చాలా సార్లు నా లోపల విసుక్కునేవాణ్ని. ఆయనకి అంతకన్నా దూరంగా నేను అమెరికాలో విస్కాన్సిస్‌లో ఉన్న మాడిసన్‌ వెళ్లిపోయాక విచిత్రంగా ఆయన దగ్గిరయ్యారు. రాత్రీ, పగలూ అనకుండా టెలిఫోన్‌ లో మాట్లాడ్డానికి వీలుదొరికేది. మరీముఖ్యంగా ఆయన కథా శిల్పం మీదా, విమర్శా సిద్ధాంతాల మీదా రాసిన పుస్తకం వచ్చిన తరవాత- ఆయనతో చాలాసార్లు వివరంగా మాట్లాడాను. మాట్లాడే విషయం లో గాఢతకీ, ఆ మాట్లాడే తీరుకీ ముచ్చటపడుతూ మాట్లాడాను.
తెలుగుకథకి ఉన్న సామాజిక స్వభావాన్ని ఆయన ఎంతో స్పష్టం గా, విమర్శయుతంగా పట్టుకున్నారు. కథ సామాజిక పురోగమన ధర్మాన్ని నెరవేర్చాలని ఆయన బలంగానమ్మారు. తెలుగు కథా విమర్శని గట్టి సిద్ధాంత పునాదుల మీద నిర్మించిన ప్రత్యేకత ఆయనదే. కథ చదివి అందులో విషయాన్ని తిరిగి చెప్పి అది సామాజిక ప్రయోజనం నెరవేరుస్తోందనే మాట పడికట్టుపదాలతో ఉద్ఘాటం చేసే విమర్శల ధోరణిని మొదటిసారిగా మార్చి, తెలుగుకథారూపాన్ని, దాని శిల్పాన్ని తాత్విక పునాదుల మీద నిలబెట్టిన వాడు వల్లంపాటి.
మార్కిస్టు సిద్ధాంతం మీద విశ్వాసం పోగొట్టుకోకుండా, సాహిత్య రూపాల మీద శ్రద్ద పెట్టిన చాలా కొద్ది మంది విమర్శకుల్లో ఆయన ఒకరు. సాహిత్య విమర్శంటే రాజకీయ ఉపన్యాసమే అయిపోయిన ఈ రోజుల్లో - సాహిత్య రూపం మీద దృష్టితో, ఆలోచనాత్మకంగా, విశ్లేషణ సామర్థ్యంతో కథని, కథాకథన మార్గాన్ని, కథా నిర్మాణాన్ని సిద్ధాంతీకరించిన విమర్శకుడు వల్లంపాటి.
ఇంగ్లీషులో ఉన్న సాహిత్య విమర్శని అది పొందిన వివిధ పరిణామాలతో చారిత్రక దృక్పథంతో బోధపరచుకున్న చాలా కొద్దిమంది తెలుగు విమర్శకుల్లో వల్లంపాటి ఒకరు. దానికి తోడుగా- తెలుగు సాహిత్యంతో మొదలుపెట్టి, ఆధునిక సాహిత్యం దాకా శ్రద్దగా చదివి న ప్రత్యేకత ఆయనది. మాటలు దొర్లించడానికీ, డొల్ల పొగడ్తలు పొగడడానికీ, పెద్ద ఆలోచన అక్కర్లేకుండా ప్రా చ్య పాశ్చాత్య విమర్శకుల పేర్లు గాలిలో కబుర్లలా ఉదాహరించే వాతావారణంలో ఆయన చదివిన చదువుని గమనించి ఆయ న చేసిన పనిని కొనసాగించే కొత్త విమర్శకు లు ఎక్కడైనా ఉన్నారా అని వెతుకుతుండే నాకు- ఆయన పోయారనే కబురు ఒక స్నే హితుడు పోయారనే నొప్పి కలిగించడంతో పాటు ఒక విమర్శ సంప్రదాయం బలంగా ఏర్పడకముందే ఆ సంప్రదాయ ప్రవర్తకు డు తెరమరుగయ్యాడే అనే నిరాశ కలిగించి దిక్కుతోచకుండా చేస్తోంది.
ఆధునికంగా వొస్తున్న మార్పుల వల్ల, ప్రపంచీకరణ వల్ల కలుగుతున్న చవకబారు లాభాలవల్ల తన సాంస్క­ృతిక స్థైర్యాన్నీ, నిలకడనీ, ఉనికినీ గబగబా పోగొట్టేసుకుని ఒక డొల్లబారిన సంకర సంస్క­ృతిని చేతులారా కావిలించుకోడానికి తహతహలాడుతున్న ఈనాటి నాగరిక యువతరం కన్నా ‘వెనకబడిన’ రాయలసీమలో ఇంకా వేళ్లూనిన సాహిత్యసంస్క­ృతి ఉందని గమనించి దానిని వివరించిన ప్రత్యేకత వల్లంపాటిది.
పుట్టపర్తి నారాయణాచార్యులు గారు వల్లంపాటి సాహిత్య గురువులు. ఆ మహా పండితుడి సాహచర్యంలో తెలుగూ, సంస్క­ృతమూ, కన్నడమూ చదివి, ఆ సాహిత్యాలలో ఉండే బలాన్ని తెలుసుకుని, దాన్ని ఆధుని క విమర్శ చైతన్యంతో విశ్లేషించి, అనుసరించిన విశేష ప్రజ్ఞావంతుడు వల్లంపాటి. పుట్టపర్తినారాయణాచార్యులుగారిని గురించి వల్లంపా టి మాట్లాడుతుంటే, ఆయన కళ్లల్లో వెలుగూ, ఆ గొంతుకలో మెచ్చుకోలూ నన్ను అచ్చమైన తెలివితేటల్లాగా చకచ్చకితం చేసేవి. పుట్టప ర్తి వారిని గురించి వల్లంపాటి మాటలు మళ్లామళ్లా వినాలని ఎదురుచూసేవాణ్ణి. కాని ఇంత మెచ్చుకోలుతోనూ వల్లంపాటి పుట్టపర్తివారిని సవిమర్శకంగా చూడడం మానలేదు. వల్లంపాటి ఎవరికీ ఆరాధకుడు కాలేదు. తన విమర్శ దృక్పథాన్ని ఎప్పుడూ వొదులుకోలేదు.
నన్ను ఎప్పటికీ వొదలని నిరాశ ఏమిటంటే, అటు పుట్టపర్తి వారి పాండిత్యాన్నీ మనం పూర్తిగా వినియోగించుకోలేదు. దానిని వినియోగించుకుని అందువల్ల పరిణతి పొందిన వల్లంపాటినీ మనం పూర్తిగా వినియోగించుకోలేదే అని. వల్లంపాటి రాసినది తక్కువేమీ కాదు. కాని రాయగలిగింది, అవకాశాలు సరిగా ఉంటే రాసి ఉండేది ఇంకా చాలా ఎక్కువ.
వల్లంపాటి ఏ విశ్వవిద్యాలయంలోనో మంచిస్థానంలో ఉంటే, తన దగ్గర చురుకైన విద్యార్థులు తయారయివుండేవారు. తనదైన ఒక ఆలోచనామార్గాన్ని, ఒక కథా విమర్శ సంప్రదాయాన్ని నిండు గా నిలబెట్టివుండేవాడు. ఆ అవకాశం ఆయనకు కల్పించే సాహిత్య వైజ్ఞానిక రంగం మనకి ఏర్పడలేదు. ఆయనే అలాంటి రంగాన్ని ఏర్పరచగలవాడు. కానీ ఆ పని ముగియకముందే వల్లంపాటి వెళ్లిపోయారు.
తెలుగులో కవిత్వాన్ని గురించి ఆలోచించిన వాళ్లూ, విమర్శలు రాసిన వాళ్లూ చాలా మంది ఉన్నారు. కాని కథని పట్టించుకున్న విమర్శకులు లేరని అనుకునేవాణ్ణి. ఆధునిక తెలుగు సాహిత్య ప్రపం చంలో కథకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించి వల్లంపాటి చేసిన పని చూసి ఇది మరికొందరు అంది పుచ్చుకుంటారనే నమ్మకం కలిగింది.
కాని వల్లంపాటితో చర్చించవలసినవి నాకు చాలా ఉన్నాయి. రాజకీయ సిద్ధాంతానికీ, కథా ప్రాణానికీ ఉన్న సంబంధం గురించి మరీ మాట్లాడాలనుకునేవాణ్ణి. విమర్శ ఎంత తీవ్రమయినదయినా, ఆవేశ పడకుండా విని, సరళంగా, ఓపిగ్గా, సహేతుకంగా చర్చించగలిగిన ఆయనతో ఎలాంటి అభిప్రాయమైనా, సంకోచించకుండా చర్చించడానికి వీలుండేది. ఇంకా ఎన్ని ఉన్నాయో మాట్లాడడానికీ, ఆయనతో పోట్లాడడానికీ. కానీ ఈ లోపునే ఆయన వెళ్లిపోయారు.
చికాగోలో ఆయనతో ఎడతెరిపి లేకుండా చెప్పిన కబుర్లలో రెండు పెద్ద మేడలు కట్టాము. ఒకటి - తెలుగు కథల్లో మంచి కథలు కూర్చి ఒక ప్రపంచస్థాయికి రాగలిగిన సంపుటిని తయారుచేసి, దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి ప్రపంచవ్యాప్తం అయేలా ప్రచురిద్దామని. మంచి కథలు అంటే నిజంగా మంచి కథలే. వాటి సాహిత్య స్థాయి తప్ప మరే మినహాయింపు లేకుండా నిక్కచ్చిగా మంచి కథలే ఎంచుకుం దామనీ, ఆ సంపుటికి బలమైన విమర్శతో కూడిన ముందు మాట రాద్దామనీ. ఇది ఒక మేడ. ఈ మేడ గురించి ఇంకొంచెం చెప్పాలి.
తెలుగులో ప్రస్తుతం బలంగా వీస్తున్న రాజకీయ, సామాజిక, ప్రాంతీయతా ధోరణుల బలమైన గాలులు మా కథా సంపుటిలో కథ ల ఎంపికకి బలాన్ని ఇవ్వాలే గాని, ఆటంకాలు కాకూడదని ఇద్దర మూ ఒప్పుకున్నాం. తనకున్న కథానుభవాన్ని, కథాభిరుచినీ ఈ ప్రయత్నంలో జోడించడానికి జంపాల చౌదరిగారు, అంతకుముందే నవీన్‌ అంగీకరించారు. ఈ పనిలో - దూరంగా కూర్చున్న నా బోటివాడు చెయ్యగలిగినది ఎక్కువ కాదనీ, ఇందులో చాలా మంది అనుభవాలు కలవారనీ నేను మరీమరీ పట్టుబట్టాను. అప్పటికప్పుడు కూర్చుని రాత్రి చాలాసేపు అయేదాక వల్లంపాటీ, జంపాలగారూ, నేను ఓ కథల జాబితా తయారు చెయ్యడం మొదలుపెట్టాం కూడా. ఇలా మాట్లాడేటప్పుడు ఫలానా కథ ఎందుకు మంచిదో వల్లంపాటి విశ్లేషిస్తుంటే నేను టైముసంగతి మరిచిపోయి వింటూ కూర్చున్నాను.
ఇకపోతే, తెలుగు కథాకథన సంస్క­ృతి ఒకటి ప్రత్యేకంగా ఉందా, లేకపోతే ప్రపంచంలో ఉన్న కథల సముద్రంలో తెలుగు కథ కాకి రెట్టలా కలిసిపోతుందా అని ప్రశ్న వేసుకుని తెలుగులో కథ చెప్పే విధానాలని పేదరాసి పెద్దమ్మ కథలనించి కుప్పిలి పద్మ కథల దాకా, పింగళి సూరన కావ్యాల లాంటి నవలల నుంచి కేతు విశ్వనాథ రెడ్డి కథల దాకా అన్ని విశేష కథనా రీతుల్నీ చూసి విశ్లేషించి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలమా? తెలుగు కథాకథన సంప్రదా యం/విధానం సిద్ధాంతీకరించాలి. దానిమీద ఒక గోష్ఠి, ఒక చర్చ నడిపి ఒక మంచి పుస్తకం రాయాలి. ఇది మేం కట్టిన రెండో మేడ.
ఈ రెండు మేడలూ కబుర్లతో కట్టినవే. కాని ఆ క బుర్ల వొట్టి గాలి కబుర్ల కావు. వల్లంపాటితో ఏం మాట్లాడినా అవి గాలికిపోయే కబుర్ల కావు. ఆ కబుర్ల మేడలు అక్షరాల సౌధాలు అవకముందే వల్లంపాటి కన్నుమూశాడు. కానీ ఆ కబుర్ల పునాదులు నా మనస్సులో లోతుగా ఉన్నాయి.
ఈ రాత్రంతా ఢిల్లీలో ఉన్న నాకు నిద్రపట్టకుండా మనస్సు నిండా ఆ కబుర్లు ఆవరించుకుని ఉన్నాయి.
(ఆంద్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో)
రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌ లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌ గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాసారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని(Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు గారు ప్రస్తుతం ఎమరి యూనివర్సిటీ లో పనిచేస్తున్నారు. ... 

september 11,2011



వైఎస్‌ఆర్‌ జిల్లాపై

  • రాజుకఁంటోన్న ఉద్యమం
  • పేరు మారుస్తే ఊరుకోబోమంటున్న విపక్షాలు
  • సిఎం వద్ద పంచాయతీ
  • మళ్లీ అభిప్రాయ సేకరణ
ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన కడప జిల్లాను వైఎస్‌ఆర్‌ జిల్లాగా మార్చడంపై రేగిన వివాదం తీవ్రతరమవుతోంది. రోజు రోజుకఁ వివాదం రాజుకఁంటోంది. ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు, కార్మిక సంఘాల నుంచి పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్‌ఆర్‌ జిల్లా పేరును తొలగించి కడప జిల్లాగానే కొనసాగించాలఁ కొందరు కోర్టును సైతం ఆశ్రయించారు. కడప పేరు మార్పుపై వివరణ ఇవ్వాలఁ జిల్లా కలెక్టర్‌కఁ ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది సెప్టెంబర్‌ మూడవ తేదీన వై.ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అదే రోజు సమావేశమైన రాష్ట్ర మంత్రి వర్గం కడపకఁ వైఎస్‌ఆర్‌ పేరును పెట్టాలఁ తీర్మాఁంచింది. ఆ తర్వాత అక్టోబర్‌ ఆరవ తేదీన కడప పేరు మార్పుపై అభ్యంతరాలు తెలియజేయాలఁ కలెక్టర్‌ బహిరంగ ప్రకటన చేశారు. అప్పట్లో టిడిపి, సిపిఎం, సిపిఐ, పీఆర్పీ, బిజెపి, మానవ హకఁ్కల వేదిక, విరసం, పౌరహకఁ్కల సంఘాలతో పాటు ప్రజా సంఘాలు లిఖిత పూర్వక అభ్యంతరాలు తెలియజేశాయి. అయితే ప్రభుత్వం వాటిఁ ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కడప పేరును మార్పు చేస్తున్నట్లు రహస్య బ్యాలెట్‌ ద్వారా అభిప్రాయాలను తెలుసుకోవాల్సి ఉంది. ఈ పఁ కూడా ప్రభుత్వం చేయలేదు. ఎవరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకోకఁండానే ఈ నెల ఏడవ తేదీన జిఓ నెంబర్‌ 613ను ప్రభుత్వం జారీ చేసింది. అదే రోజు జిల్లా గెజిట్‌లో చేర్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి అధికారికంగా కడప పేరును తొలగించి వైఎస్‌ఆర్‌ జిల్లాగా కలెక్టరట్‌ కార్యాలయపు బోర్డుపై పేరు మార్చారు. ఈ విషయంపై ఈ నెల 12న మానవ హకఁ్కల వేదిక జిల్లా కన్వీనర్‌ జయశ్రీ, 14న విరసం నాయకఁలు వరవరరావు, ప్రొఫెసర్‌ హరగోపాల్‌, వకఁళాభరణం రామకృష్ణ, మృణాళిఁ, ఓల్గా, వింధ్యా వంటి వారు సైతం హైకోర్టులో రిట్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం చల్లబడింది. శ్రీకృష్ణ దేవరాయలు పట్టాభిషేక పంచ శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా సిద్దవటం, కడప కళాక్షేత్రంలో ఁర్వహించిన సభల్లో కాంగ్రెస్‌ సీఁయర్‌ నాయకఁలు, మైదుకూరు శాసనసభ్యులు డాక్టర్‌ డి.ఎల్‌.రవీంద్రారెడ్డి కడప పేరు మార్పుపై తీవ్ర ఁరసన వ్యక్తం చేశారు. కడప పేరును తొలగించడం బాధాకరమఁ ఆయన వ్యాఖ్యాఁంచారు. డిఎల్‌ చేసిన వ్యాఖ్యలు జిల్లాలో చర్చయానీయాంశమైంది. కడప పేరు చేర్చే వరకఁ ఉద్యమిస్తామఁ డిఎల్‌ ప్రకటించారు. ఇందుకఁ వ్యతిరేకంగా మేయర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ నాయకఁలు పేరు మారిస్తే తామూ ఉద్యమం చేస్తామఁ ప్రకటించుకఁన్నారు. కడపపేరు మార్చడంపై ప్రతిపక్షాలైన తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ, ప్రజారాజ్యం, బిఎస్‌పి, బిజెపి సైతం తమ ఁరసన గళాఁ్న విఁపించాయి. కడప పేరును అలాగే కొనసాగించకఁంటే ఉద్యమిస్తామఁ హెచ్చరించాయి. బ్రహ్మంగారు, మొల్ల, అన్నమయ్య, పుట్టపర్తి నారాయణాచార్యులు, కోటిరెడ్డి, ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి, రచయితలు వేమన, బమ్మెరపోతన, ముకఁ్కతిమ్మన, భట్టుమూర్తి వంటి ప్రముఖులు ఎంతో మంది ఉండగా కేవలం 26 సంవత్సరాల రాజకీయచరిత్ర ఉన్న వైఎస్‌ఆర్‌ పేరుతో జిల్లాను ఎలా మారుస్తారనే అంశాఁ్న ఆ పార్టీలు తెరపైకి తెచ్చాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఒకడుగు ముందుకేసి కడప పేరు తొలగింపు వ్యవహారాఁ్న రాష్ట్ర రాజధాఁకి చేర్చింది. ఆ పార్టీకి చెందిన ప్రతిఁధి బృందం ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయి జిల్లా చరిత్రను వివరించారు. కడప పేరు మార్పు విషయం తనకఁ తెలియకఁండానే జరిగిందఁ ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. కడప పేరు తొలగింపునకఁ సంబంధించి విచారణ చేపట్టి తగు చర్యలకఁ సిఎం ఆదేశాలు జారీ చేశారు. మళ్లీ అందరితో అభిప్రాయాలు తీసుకఁఁ కడప పేరు కొనసాగింపుపై ప్రభుత్వం ఁర్ణయం తీసుకోనుంది. జిల్లాలోఁ అత్యధిక మంది కడప పేరును కొనసాగించాలఁ ఆందోళనకఁ సిద్దమవుతుంటే కాంగ్రెస్‌ పార్టీలోఁ కొందరు మాత్రం తమ స్వార్థరాజకీయాల కోసం వైఎస్‌ఆర్‌ జిల్లాగానే కొనసాగించాలఁ కోరడం విమర్శలకఁ తావిస్తోంది. చరిత్రతో పెనవేసుకఁన్న పేరును తొలగించడం అన్యాయమఁ ప్రతి ఒక్కరు తమ గళాఁ్న విఁపిస్తున్నారు. కడప పేరు మార్పుపై ప్రభుత్వం మళ్లీ పునఃసమీక్షిస్తుందా? లేక వైఎస్‌ఆర్‌ జిల్లాగానే కొనసాగిస్తుందా? అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచిచూడాల్సిందే.



బుధవారం :

21/09/2011


జ్ఞాపకాల పుట్ట’పర్తి...
పందొమ్మిది వం దల ఎనబయ్ దశకం మాట - కడపలోని
శ్రీరామకృష్ణ సమా జంలో వావికొలను సుబ్బారావుగారి
 జయంతి సభను జిల్లా రచయితల సంఘం ఏర్పాటు
చేసింది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల
అధ్యాపకులు గౌరిపెద్ది రామసుబ్బశర్మ వక్తగా
 వచ్చారు. ‘సరస్వతీ పుత్ర’ పుట్టపర్తి నారాయణా
చార్యులు సభాధ్యక్షులు. వావికొలను వారి మీద
రామసుబ్బశర్మ గారి ఉపన్యా సం ధారాపూర్ణంగా
 సాగింది. ముగించబోతూ ఆయన వావికొలను
 వారు వార్ధక్యంలో ఉబ్బసంతో బాధప డిన
సంగతిని ప్రస్తావించారు. అంతేకాదు, ఈ రోగం
కర్మఫలంగా వచ్చిందనీ, గతజన్మలో
పందికొక్కును చంపిన పాపానికి ఫలమనీ అంటూ, ఈ విషయాన్ని ప్రతిపాదించే
 ఒక శ్లోకాన్ని కూడా ఉటంకించారు. సభ ‘ఔరా!’ అని విస్తుపోతుండగా పుట్టపర్తి
వారు లేచి నిల బడ్డారు.

‘రామసుబ్బయ్యా! నీ మాట వింటూ ఉంటే నాకు చాలా గుబులౌతా
ఉందయ్యా! చాలా సంవత్స రాల నుంచి మా ఇంట్లో పందికొక్కుల
 బాధ ఉంది. ఇంకే వస్తువు నష్టమైనా భరిస్తాను గానీ, పుస్తకాలు
పాడైతే తట్టుకోలేను. ఏం చేసేది! వారానికి ఒకటి రెండు పందికొక్కు
ల్నయినా చంపక తప్పడం లేదు. ఆ కర్మఫలంగా నేనెన్ని జన్మలెత్తి
ఉబ్బసం బాధను భరించాల్నో!’ అన్నారు. సభ ఘొల్లుమంది.
నిజానికి పుట్టపర్తి వారు సద్యఃస్ఫూర్తితో చేసిన ఈ ఎదురు దాడిలో
 హేతువాదం ఉంది. ఆయన శ్రీవైష్ణవుడైన అభ్యుదయ వాది.
ఆ సరస్వతీ పుత్రుని ఇరవై ఒకటో వర్ధంతి (సెప్టెంబర్ ఒకటి)
సందర్భంగా ఒక్కసారి స్మరించుకుందాం!


- కట్టా నరసింహులు