31 జులై, 2012

ప్రాకృత కవిత




పూర్వం 
భారత దేశంలో చదువుకున్నవారు 
సంస్కృత బాషలో, 
చదువురానివారు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
చదువుకున్నవారు కూడా కొన్ని సార్లు 
ప్రాకృత బాషలలో మాట్లాడేవారు. 
కొన్ని గ్రంథాలు ప్రాకృత బాషలలో వ్రాసారు. 

ప్రాచీన ప్రాకృత బాషలలో ముఖ్యమైనది 
'పాళీ బాష. 
స్థవీరవాది బౌద్ధులు, 
హీనయాన బౌద్ధులు 
ఈ బాషని పవిత్ర బాషగా భావిస్తారు. 

జైన మతానికి చెందిన కొన్ని గ్రంథాలని 
అర్థ-మాగధి అనే ప్రాకృత బాషలో 
రచించడం జరిగింది. 

మతంతో సంబంధం లేని 
కొన్ని గ్రంథాలని కూడా 
ప్రాకృత బాషలలో రచించడం జరిగింది. 
అందులో హాలుడు రచించిన 
'గాథాసప్తశతీ ఒకటి. 

ప్రాకృత బాషలలో కథలు, 
పౌరాణిక కావ్యాలు కూడా ఉండేవి. 
వీటిలో 
'పైశాచీ' మాండలికంలో వ్రాసిన 
గుణాఢ్యుని 'బృహత్కథా, 
ప్రవరసేనుని 'సేథుబంధం' ముఖ్యమైనవి. 

అప్పట్లో 'అపభ్రంశం' 
అనే ప్రాకృత బాషలో కూడా సాహిత్యం ఉండేది. 
ప్రాకృత బాషలు ఎన్ని ఉన్నా 
సంస్కృత బాష ప్రధాన 
సాహిత్య బాషగా ఉండేది.


ఈ ప్రాకృత వ్యాసాలను అక్కయ్య 
నాగపద్మిని ముద్రించింది.
ఇందులో ..
 
ప్రాకృత కవిత
సేతుబంధము
సావయధమ్మదుహా
జసహర చరివు
కొన్ని సప్త శతులు
సంస్కృత నాటకాలలోని ప్రాకృతం
 
 అన్న వ్యాసాలున్నాయి
మొదటిదైన ప్రాకృత కవితను
మనమిప్పుడు  చూద్దాం..

ఇందులోని..
"జహరసియ సింగాయి ..ఉధ్ధరియ కందాయి.. "
అని అయ్య తాళం వేస్తూ ఊగిపోతూ చిరునవ్వుతో చెప్పడం ఎంత తీపి గుర్తో..
అది ఊరిదేవతల జాతరలలో పోతరాజును వర్ణనార్భాటము.















కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి