18 జన, 2012

పుట్టపర్తి నారాయణాచార్యులు-పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?-- పుట్టపర్తి అనూరాధ



పది కాలాలు నిలిచే కవిత్వం ఏది..?
ఒకో దశలో ఒకో రకమైన భావోద్వేగాలు చుట్టుముట్టినపుడు..
తదనుగుణంగా సాహిత్య సృష్టి జరుగుతుంది..
ఆ భావోద్వేగాల తీవ్రత తగ్గిన తరువాత ..
వాని ప్రాధాన్యమూ తగ్గిపోతుంది..
కానీ కొన్ని ..
కాలాలు ఎన్ని మారినా ..
అజరామరమై.. 
మనవులకు దిశా నిర్దేశనం చేస్తూ..
నిలచి వుంటాయి..

అవే మన రామాయణమూ..
భారతమూ..
భాగవతమూ..
తదితరాలు..
రామచంద్ర మూర్తి నడకకు రెండు కాళ్ళు
సత్యం ధర్మం..
ఎంత కష్టం రానివ్వండి ..
సత్యమూ ..ధర్మమూ..
రెంటినీ జీవితంలో విడిచిపెట్టలేదు.
 
సత్యధర్మములను నమ్ముకున్న వానిని ..
ఆ రెండూ ఎలా కాపాడతాయో ..
రామాయణం మనకు చూపిస్తుంది..
సత్యమూ ..ధర్మమూ ..
ఎంతకాలం భూమి పై వుంటాయో ..
అంతకాలం రామాయణం నిలచి వుంటుంది.
ఒక మాట ఎలా మాట్లాడాలో ..
రాముడు నేర్పుతాడు..
ఆమాటకు కట్టుబడటమెలాగో.. 
రాముడు నేర్పుతాడు..
ఇది రామాయణానికి వున్న గొప్పదనం ..
అందుకే మన పెద్దలు రామాయణాన్ని ఎన్నడూ విడిచిపెట్టలేదు..
విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం వ్రాస్తూ అంటారు..
మళ్ళీ అందరూ వ్రాసే రామాయణం వ్రాయటమెందుకు..
అంటే ..
ప్రతిపూట తిన్న అన్నమే మళ్ళీ ఎందుకు తింటున్నావ్ అన్నం తినకపోతే వుండలేవు కనుక..
 
రామాయణం లేని నాడు మనిషికి జీవితమే లేదు..
మనిషి జీవితాన్ని..
మనిషి జీవితంగా నిలబెట్ట గలిగిందీ..
 
మనిషిని మనిషిగా ప్రవర్తింప జేయగలిగిందీ..
సృష్టిలో రామాయణమొక్కటే..
 
ఐన్ స్టీన్ ..
కలవడానికెళ్ళాడొకడు....
ఆయన సంస్కృతంలో ఆహ్వానించాడట ..
మన వాడికి అది అర్థం కాలేదు..
ఇది మీ సంస్కృతమే..

నీకు రాదా ..? అని అడిగాడు..
లేదు విన్నాను..

అది మన జవాబు..
 
మీ విజయ రహస్య మేమిటని అడిగితే ..
తన లైబ్రరీకి తీసుకెళ్ళి ..
ఒక పుస్తకం తీసి చేతిలో పెట్టాడుట..


అది మన భగవద్గీత..
తనకు మార్గ దర్శకత్వాన్నిచ్చినదీ గ్రంధమని చెబుతాడాయన..
పరిశోధన .. 
విశ్లేషణ ..
విచారణా .. 
దీర్ఘ దివ్య దృష్టీ ..
ఇచ్చింది ఇదే.. అన్నాడు..


చేసే కర్మను సద్భావనతో చేయి ..
సత్ జ్ఞానంతో చేయి అంటుంది..గీత..
ఏ సంస్కృతిలోని మంచినైనా ..
అంగీకరించడం సంస్కారవంతుల వల్లనే అవుతుంది..

మీ దృష్టిలో ఆధునిక సాహిత్యంలో పదికాలాల పాటు నిలబడగల రచనలేమైనా ఉన్నాయా..
మీవి ఉన్నాయా..
లేవంటే ..ఇంత సాహిత్య కృషీ.. వ్యర్థమైపోయిందనుకోవటానికి ప్రత్యేక కారణాలున్నాయా..
పది కాలాల పాటు నిలిచే కవిత్వాలు లేవని నేనెట్లా చెప్పేది..

ఒకానొకనాడు..
దేశభక్తి కవిత్వాలు ప్రముఖంగా ఉండేవి.. 
అటు తరువాత ..
ఏవో మత కలహాలకు సంబంధించిన గ్రంధాలు.. 
ఈ భావాలన్నీ ..
ఎప్పుడూ తాజాగా ఉంటాయని నాకు నమ్మకం లేదు.
 
ఇలాంటి రచనలన్నీ ..
వాటి అవసరం తీరిపోతూనే ..
మరుగులో పడిపోతాయ్ ..
శ్రీ శ్రీ కవిత్వం కూడా అంతే నేమో ఎవరికి తెలుసూ.. 


కానీ..
రామాయణ భారతాల ఆవశ్యకత ..
ఎప్పుడూ ఉంది.
భారత కథలో సన్నివేశ గాంభీర్యం ఉంది. 
రామాయణ కావ్యంలో రచనా శిల్పం ఉంది. 
సంస్కృత భారతం మన విజ్ఞాన సంపుటి. 
అందువల్ల ..
ఏ కాలంలోనైనా దాన్ని చదువుతాం..
సంస్కృతం పనికిరాదు ..
అది బ్రాహ్మణుల భాష ..
ఇలాంటి పిచ్చి పిచ్చి వాదలు శాశ్వతంగా నిలవవు. 
ఏనాటికైనా..
ఎందరు ద్వేషించినా ..
అగౌరవించినా..
సంస్కృతానికున్న మర్యాద తొలగదు. 

తమిళం కూడా మొదట సంస్కృతాన్ని బహిష్కరించడానికి ప్రయత్నించింది. 
ద్రావిడ నాగరికత కొంత ప్రత్యేకత ఉన్నదని..
వారి వాదంగా ఉండేది. 
వేదాల్లోనే ..
కొన్ని ద్రావిడ పదాలు చొచ్చుకొని పోయినాయని ..
వారు ఈనాటికీ వాదిస్తారు. 
ఏదెట్లున్నా..,
సంస్కృతం తరువాత.. 
తమిళం అంత ప్రాచీన భాష మరొకటి లేదు ..
ఈ దృష్టితో ..
రామాయణం ఆర్య ద్రావిడ నాగరికతల సమ్మేళనాన్ని మనసులో ఉంచుకొని చేసిన కల్పనగా..
కొందరు వాదిస్తారు. 
రామాయణమేమిటి..?
అంతకు ముందే ఆర్యులు ద్రావిడులు కలిసిపోవటం బహుళ ప్రచారంలో ఉంది.
ఇంకూ చెప్పొచ్చేదేమిటంటే..
సంస్కృతానికి లోబడని ..
అనంత శబ్ద సంచయం వారికున్నా సంస్కృతాన్ని బహిష్కరించడం వారికినీ సాధ్యమవలేదు 
ఇలాగా ఎన్ని భావాలు మారినా..
భారతదేశంలో ఆస్థికతా బుధ్ధి పోదేమో ..
అనే విశ్వాసం నాకుంది. 
దానికి సంబంధించి ..
దానికి సంబంధించిన ఉత్తమ శిల్పంతో కూడిన కావ్యాలు నిలుస్థాయేమో నని నా ఆశ. 
నా రచనలేమైనా ఉన్నాయా ..?
అంటే నేనేమీ చెప్పలేను ..
దానిని కాలమే నిర్ణయిస్తుంది.
నా సృష్టి వ్యర్థమైపోయిందని నేనెట్లా అనుకోను..?
నేను కాలంలో నిలుస్తాననే అహంకారం నాకుంది.
మీరు కవిత్వం రాయటం ప్రారంభించిన నాటి నుంచీ..
నేటి వరకూ చూస్తే ..
ఎన్నో మార్పులు వచ్చాయి.

మీరిప్పుడే కవిత్వ రచన ప్రారంభించే దశలో ఉన్నట్లయితే మీరెటువంటి కవిత్వం రాస్తారు..
 
ఈ ప్రశ్న ..
సంస్కారి అయిన వారి విషయంలో వేయదగ్గది కాదు. 
ప్రతిభావంతుడైన కవి ఎవర్నీ గుడ్డిగా అనుసరించడు. 

తన్నితరులు అనుసరించేలా చేసుకుంటాడు.
వాని మార్గాన్ని ..
వాని ప్రతిభ నిర్ణయిస్తుంది. 
ఇప్పుడు ..
నేను రచనను మొదలు పెట్టి ఉండినట్లయితే ..
నా మార్గాన్ని నేను అనుసరించి ఉండేవాణ్ణి..