16 మార్చి, 2012

రామాయణం నేనెందుకు రాసానంటే..??పుట్టపర్తి నారాయణాచార్యులు




రామ నామం ..
ఇప్పటికీ మనల్ని ఎలా ఉధ్ధరిస్తుందీ..??
తెలిసి కానీ..
తెలియక కానీ ..
ఒక్కసారి రామా అన్నారా ..??
లోపల ఉన్న పాప రాశి దగ్ధమైపోతుంది..

మ అమృత బీజం ..
మ అన్నప్పుడు..
 పెదవులు మూసుకుంటాయి ...
ఇంక పాపరాశి లోపలికి ప్రవేశించలేదు..

ర అగ్ని బీజం
" ఓం నమో నారాయణాయ.."
అనే అష్టాక్షరీ మహా మంత్రం లోని ప్రధాన బీజాక్షరం..
మ  పంచాక్షరీ మహా మంత్రం లోనిది..

రెండూ.. రెండు ..అధ్భుతమైన బీజాక్షరాలు..
శివ కేశవులని రెండులేవు ..
ఉన్నదొక్కటే పరబ్రహ్మ స్వరూపం.

ఎలా చూస్తే ..
అలా కనిపిస్తుంది..
ద్భావం ..తద్భవతి..!!

ఒక సారి ..
బ్రహ్మ స్వరూపం అర్థమైందనుకోండీ..
ఏమవుతుంది..??
అపారమైన ఆనందం కలుగుతుంది..

వాల్మీకి 24000శ్లోకాలలో..
 రామాయణాన్ని పూర్తి చేసారు ..
గాయత్రీమహా మంత్రం లోని..
ప్రతి వెయ్యి శ్లోకాలు..
ఒక్కొక్క బీజాక్షరానికి వ్యాఖ్యానం .
గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకత ఉంది.
మిగిలిన మంత్రాలలో ..
ఒక బీజాక్షరం ఉంటుంది.

ఆ బీజాక్షరానికి..
ఒక ఋషి. 
ఒక దైవము.
గాయత్రీ మంత్రం అలా కాదు ..

24 అక్షరాలూ  బీజాక్షరాలే...
24 మంది ఋషులు.
అందుకనే ..
24000 శ్లోకాలలో రామాయణం వచ్చింది.


తులసీరామాయణాన్ని ..
పదమూడు సంవత్సరాలు..
దేక నిష్టతో పారాయణ చేసారు అయ్య..
 

పుణ్యక్షేత్రాలకు బస్సులో వెళ్ళి ..
దారి లో ..

ఎదురైన సాధువులను..
మొక్కుకుంటూ వెళ్ళటమే తప్ప...
 

ఎవరైనా ..
జేబులో పైసా లేకుండా..
సాధు సంతులను వెతుక్కుంటూ వెళ్ళ గలరా..
అదీ ఎందుకు ..??
ఎన్నో కోట్లు జపం చేసినా..

అధ్యాత్మిక మైన అనుభూతులు కలుగలేదని..
అది ఎన్ని సార్లు..

మళ్ళీ ..మళ్ళీ ..విన్నా..
మళ్ళీ ..కొత్త గానే వుంటుంది..!!

అయ్య అలా వెళ్ళారు..

పూర్తి ఇండియా అంతా తిరిగారు..
హిమాలయాలలో..
శివానంద సరస్వతులవారిని కలుసుకోవటం..
ఒక అపురూప మైన అనుభవం..!!

అసలు రామాణం రాసే ఉద్దేశం.. 
నాకెందుకేర్పడిందంటే..
నలభై ఎనిమిదీ ..
నలభై తొమ్మిదీ ..
అప్పుడు కొన్ని కోట్లు ..
జపం చేసుకున్న తరువాత కూడా 
నాకేమీ ఎక్స్ పీరియన్స్ కలగకపోవడంతో ..
నాకు జీవితంపై విరక్తి పుట్టి ..
సాధువులనూ ..
సన్యాసులనూ ..
వెతుక్కుంటూ ఇండియా అంతా తిరిగినాను.

ఆ ఊపులో ..
నేను హిమాలయాలలో..
కొంత కాలం ఉండడమూ..
శివానంద సరస్వతుల యొక్క అనుగ్రహమూ ..
నాపైన ప్రసరించడమూ జరిగింది. 
వారే ఇచ్చింది సరస్వతీ పుత్ర అన్న బిరుదు.

అంతకు ముందు ..
ఎప్పుడు ఎవరు బిరుదులిచ్చినా..
పెట్టుకొనే అలవాటు నాకు లేదు..
చాలా మంది..ఇచ్చినారు..
ఆ ప్రొద్దుటూరులో అభినవ కాళిదాసన్నారు 
నాచన సోముడన్నారు.
చాలా ..
ఆ గద్వాలలో ..
చాలా చిన్న వయసులోనే అభినవ పోతన.. అన్నారు. 

ఒక రూపాయ్ ఇస్తే ..
అపధ్ధం చెబుతాను నేను.. 
ఇటువంటివాణ్ణి ..
అభినవ పోతన.. అని ఎందుకంటావు..??
అని నమస్కారం పెట్టి వచ్చేసినాను. 
తరువాత బాపట్ల లో 
కవి సార్వభౌమ అని బిరుదు ఇచ్చినారు.
 వెనక్కే ఇచ్చేసినాను..

అయ్యా నేను బీదవాణ్ణి...
నాకు డబ్బు లేక ..మీ ఊరికి వచ్చినాను..
వెయ్యి రూపాయలు ఇచ్చినారు...
ఇంకో నూట పదహార్లు కలిపి ఇవ్వండి 
సంతోషపడతాను. 
కవి సార్వ భౌమ బిరుదు మీరే వెనక్కి తీసుకోండి..
 
సాధారణంగా..
ఎక్కడ బిరుదులిచ్చినప్పటికిన్నీ గూడా ..
ఒప్పుకునే మనస్తత్వం నాకు లేదు..
 నాకెందుకయ్యా.. కొత్త బిరుదు...
నేను పుట్టపర్తి నారాయణాచార్యులు ..
అంతే..

నేను అభినవ కాళిదాసూ కాదూ..
ఎవడూ కాదు.. 
కానీ ఆ శివానంద సరస్వతి ఇచ్చిన 
బిరుదు మాత్రం ఉంది. 
మరి వారు నిర్భంధించినారు. 

నేను కైలాసంలో ..
ప్రాణత్యాగం చేయవలెనని ..పోతూ ఉండినాను.
 ఆ గంగ ఒడ్డున శివానందులు 
అక్కడ ఉన్నారని నాకు తెలియదు. 
ఆయన పుస్తకాలు చదివినాను ..

నేనా గంగ ఒడ్డున నడిచి వెళ్ళే సన్నివేశం..
ఆయన ధ్యాన మందిరం ముంచీ ..
గడ్డకు వచ్చే సన్నివేశం ..
రెండూ ఒకేసారి జరిగాయి...!!
who are you..?
where are you going  ..?

అని ఆయన నన్నడిగినారు.

సరే..
నా కథ నేను చెప్పినాను..
లోపలికి పోదాం రమ్మన్నాడు.
కొంతకాలం తన దగ్గర ఉంచుకున్నాడు. ..
ఆయన అన్ని విద్యల లోనూ పరీక్షించినాడు...

అంటే ..
భాగవతమన్నాడు..
సంస్కృతమన్నాడు. ..
ఇతర భాషల్లో ..అన్నాడు..
సంగీతమన్నాడు..
నాట్యం వచ్చునా ..??
అన్నాడు ..
అన్నీ అడిగినాడు.. 
కొంతకాలం వారితో ఉన్నాను నేను
ఆయన సరస్వతీ పుత్ర అనే బిరుదిచ్చి..

నాయనా..
దీన్ని నువ్వు వాడుకోవలె ..
నామీద ఉన్న గౌరవంతో ..
 అని అన్నాడు. 
నువ్వు వెనక్కి పో ..
నీకింకా కొంత కర్మ శేషమున్నది...
 అంతా తృప్తిగా అనుభవించు ..
నువ్వు దేనికీ భయపడవద్దు. !!
నీది ఉత్తమమైన జన్మ. 
అని చెప్పి ఆయన వెనక్కు పంపించినాడు.
ఆయన పుస్తకాలన్నీ ఇచ్చి...
 
ఒకసారి ..
కాశీ నుంచీ ..లక్నోకు పోతూ ఉన్నాను. 
మన దగ్గరేముందీ.. 
టికెట్టా ..??బకెట్టా ..?
షష్టి పంచె కట్టుకోని పోతున్నాను. 
లోపలంతా జనం దిక్కులేనంతమంది ఉన్నారు. 
ఆ కడ్డీలు పట్టుకుని నిలబడున్నారు. 
పోతూ ఉంది ట్రెయిన్..

ఆ లోపల్నుంచీ.. ఎవరో ..
తులసీ రామాయణంలో ఒక లైన్ చెప్పినారు. అప్పుడారంభించినాను..
 
బిను సత్ సంగ వివేకనహోయీ--
రామకృపా బిను సులభనసోయీ..
సత్సంగతి ముదమంగలమూలా--
సోయి పరసిధ్ధి సత్ సాధన ఫూలా..
సరసు తరహి సత్ సంగతిపాయీ--
పారస పరసి కుధాత్ సుఖాయీ
బిదిబస సంగ సంగతి పరహీ--
ఫణమని సమ నిజగున్ అనుసరహీ..
అని అందుకున్నాను...
 
కౌన్ హై బాహర్ మహరాజ్..
అందర్ ఆయియే..
అందర్ ఆయియే ..మహరాజ్..
అన్నారెవరో..

ఒక బెంచీ నాకు ఖాళీ చేసి ఇచ్చినారు. 
తరువాత ..
పండ్లు పాలు ఇచ్చినారు...

ఆప్ ఇధర్ జానా హై ..అన్నారు ..
హమే తో హరిద్వార్ జానా హై..
 అన్నాను. .

టికెట్ హై ఆప్ కే పాస్ ..??
అన్నారు ..

హం బైరాగి ..అన్నాను. ..
అప్పుడు లక్నో నుంచీ టికెట్ తీసిచ్చినారు...!!

తరువాత ..
హరిద్వార్ వరకూ ..
కు రాజభోగం జరిగిందనమాట.. ..
నవ్వు.. 

ఓహో ..
తులసీ రామాయణమంటే..
ఉత్తర భారతంలో ..
అంత గౌరవముందన్నమాట..!!


ఇటువంటిది ..
తెలుగులో ఒకటి వస్తే బాగుంటుంది కదా.. !!
అనేటటువంటి సంకల్పం..
అప్పుడే పుట్టింది నాక

దువల్ల 
నేను రాసిన ..
జనప్రియ రామాయణం పైన..
తులసీ రామాయణం ఇన్ ఫ్లుయన్స్ ..
 ఒక్కటే కాదు... 
ఏకనాధ భాగవతం ఇన్ ఫ్లుయెన్స్ ఉన్నదీ ..
కబీరు సూక్తులూ ప్రతిఫలించినాయి. 
కంబ రామాయణం ఇన్ ఫ్లుయెన్స్  ఉన్నది..!!