19 మార్చి, 2012

పుట్టపర్తి నారాయణాచార్యుల తత్వం రమణ తత్వమేనా..??




 ఇది..
శ్రీనివాస ప్రబంధం పీఠిక..
దీనిలో అయ్య ..
ప్రతి పనిలో..
తన ఉపేక్షా భావానికి చింతిల్లినారు..

ఢిల్లీ లోనే అయ్య ఉండినట్లయితే ..
జ్ఞాన పీఠమేం ఖర్మ ..
నోబల్ బహుమానమూ ..
అయ్య ఒడిలో వచ్చి చేరేది..

కడప లాంటి చీకటి ఖండంలో ..
బండ హృదయాల నడుమ ..
అయ్య తన రచనా వ్యాసంగానికి ..
ఉపాసనా జీవనానికీ..
అది ఒక రహస్య మయ స్థావరంగా ..
ఎంచుకున్నారేమో..

ఈ జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా..
యేమి నోము నోచె ఈ యశోద..

పరీక్షిత్తు భాగవతం చెబుతుంటే..
లీలాశుకుడు ప్రశ్నించాడట..

అలా..
ఒక పరమ పురుషుడు ..
అక్కడ నడయాడటానికి..
రాయలసీమ లోని రాళ్ళూ.. 
పుణ్యం చేశాయేమో..!!

గిరిధారిలాల్ అరవింద ఆశ్రమవాసి. 
ఒకసారి ..
అతడు రమణమహర్షి దగ్గరకు వచ్చి  ..
పురాణాలు..
ప్రతి యుగం ఇంతకాలం ఉంటుందని ..
ఎందుకు చెప్తాయి..??
అని ..
తన సందేహాన్ని బయటపెట్టాడు గిరిధారి. 

దానికి సమాధానంగా మహర్షి..
‘‘ఒక్కొక్క యుగం..
ఇంతకాలం ఉంటుందని చెప్పడంలో ఉద్దేశం... 
మనిషికి ఉన్న వందేళ్ల జీవితం ..
ఎంత స్వల్పమైనదో తెలుపడమే..."

కాబట్టి..
మనిషి జగత్తులో..
తన స్థానమేమిటో తెలుసుకుని..
తన ప్రాముఖ్యాన్ని..
గొప్పగా భావించకుండా ఉండాలి

మనకు అశాంతిగా అనిపించినప్పుడు ..
పర్వతాలను..
నదులను.., 
నక్షత్రాలను.., 
చంద్రుడిని ..,
చూస్తే శాంతి లభిస్తుంది..
అలాగే ..
ఎంతో దూరంలో ఉన్న,,
గ్రహాల చుట్టూ మన ఆలోచనలను పోనిస్తే ..
‘ఇంత విశాలమైన ఖగోళంలో భూమి ఎంత? 
ఆ భూమి మీద మనమెంత..?
 అన్న భావన ..
ఎవరిలోనైనా ఇట్టే కలుగుతుంది...
అప్పుడు ..
మనిషి ..
తన సంపదలు.., 
పేరుప్రతిష్ఠలను ..
చూసుకుని గర్వపడడానికి.., 
తన కష్టనష్టాలకు కుంగిపోవడానికి ..
అవకాశం ఉండదు... 
అన్నారు రమణులు..
 
రమణులంటే అయ్యకు ప్రాణం..
అందుకే ప్రతిదానిలోనూ ఉపేక్ష..

అనేక మార్గాల్లో..
కీర్తిని కొనుక్కొనే వారిపట్ల అసహ్యం చూపారు..అయ్య
ఇటువంటి వాళ్ళకు..
యేమి రాస్తే యేముందిలే అనే నిర్వేదం..కూడా..

ఇది వ్రాసే సమయంలోనే అమ్మకు అనారోగ్యం..
మాటి మాటికీ ఫిట్సు..
తడవ తడవకూ..
డబ్బులకు  చేయి తడుముకోవలసిన పరిస్థితి..

ఈనాటికి ..
శ్రీనివాస ప్రబంధము..
మొదటి భాగము పూర్తయినది..
ఇంకా రెండవ భాగం ప్రింట్ కావలసి వుంది...

ఈ నడుమ ..
ప్రభుత్వము గ్రంధ ప్రచురణలకు..
సహాయము నిలిపివేసినదని విన్నాను..

మరి ..
ఉత్తరార్థం..
యెప్పుడు గడ్డకు వస్తుందో చెప్పలేను..
అన్నీ ..
ఆ పరమేశ్వరుని దివ్య చిత్తానికి వచ్చినప్పుడే..
వచ్చినట్లే జరుగుతాయి ..
ఈ ప్రబంధం రచన ప్రారంభించి ..
సుమారు ముఫై యేండ్లకు పైగా అయింది... 

ఏ గ్రంధం గానీ ..
మొదలు పెట్టి..
దీక్ష గా ముగించే అలవాటు నాకు లేదు..
కొన్ని సంవత్సరాలు కూడా..
ఆ వైపు చూడకుండా వుండడం కద్దు..

ఈ ఒక్క విషయంలో కాదు..
ప్రతి పనిలోనూ...
నా ప్రవృత్తి ఇంతే ..
ప్రతిపనిలోనూ..
విపరీతమైన ఉపేక్షాభావం. 
తీరా నెత్తిపైకి వచ్చినప్పుడే..
కార్యానికి పూనుకోవడం..

ఈ ఉపేక్షా భావంతో ..
యేన్ని విషయాల్లోనో నష్టపడినాను ..
కానీ ఈ జీవి ప్రవృత్తి అంతే...!!

1939 నుండీ ..
నేను రేడియోలో ఇచ్చిన రచనలు కోకొల్లలు. 
అయినా ..
యే ఒక్కటీ నాదగ్గర లేదు.
దాని ప్రసక్తి తీరుతూనే ..
యెక్కడ పారేస్తానో నాకే తెలియదు...

పైగా..
యేవేవో భావాలు ..
నా జీవితంలో యేంతో మందిని..
హెమవత్శిఖరాల వంటి వారిని చూచినాను...
వారు పేరూ ప్రఖ్యాతీ లేకుండా పోయినారు...!!
మనదేముందిలే అనే భావం. 
నన్నెప్పుడూ పీడిస్తూ వుంటుంది..

పైగా ..
లోన లొటారంగా..
కీర్తిని అనేక మార్గాల్లో..
కొనుక్కునే వాళ్ళను చూచి అసహ్యం 
వీళ్ళకు యేమి రాస్తే యేముందిలే 
అనే భావం ఇంకా యెన్నో..