3 సెప్టెం, 2012

ఆశ్చర్యం..!! ఆనందం..!! ఎం ఎస్ రెడ్డి




అది ఎం ఎస్ రెడ్డి గారి
 శ్రీ కృష్ణ విజయం షూటింగ్ ..
నాగభూషణం గారు 
అచ్చం శ్రీ కృష్ణుని వేషధారణలో 
మేకప్ వేసుకొని కూచునివున్నారు.

ఎన్ టి ఆర్ గారు వచ్చారు..
వీడెవడు కృష్ణుని వేషంలో వున్నాడు..
అంటే శ్రీ
కృష్ణుని లానే వుంటుందీ పాత్ర  అన్నారట
అయితే అతన్నే పెట్టి సినిమా పూర్తి చేసుకోండి
అని చిరచిర లాడారట..ఎన్ టీ ఆర్
 
అతను  పౌండ్రక వాసుదేవుడు..
అచ్చం శ్రీ కృష్ణుని అనుకరిస్తూంటాడు
అతని ఆగడాలు భరించలేక 
ఒక నాడు కృష్ణుడతన్ని మట్టుబెడతాడు.
అని భాగవత వివరణ ఇచ్చారు ఎం ఎస్ రెడ్డి
కానీ మొదట భీష్మించిన ఎన్ టి ఆర్ ను 
నటిస్తే నటించండి లేకపోతే పోండి 
అన్న ఘన త ఎం ఎస్ రెడ్డి గారిదే.

తన నిర్మొహమాట మనస్తత్వంతో 
ఎన్ టి ఆర్ నే ఖంగు తినిపించిన మనిషి
 
నిర్మాతగా గేయ కవిగా పద్య కవిగా
చిత్రపరిశ్రమలో పెద్ద దిక్కుగా 
మంచి చిత్రాలు నిర్మించారు.

మల్లెమాల రామాయణం వ్రాసారు
సహజకవి ఆంధ్రా వాల్మీకి అని బిరుదులు
మంచి మనసు కల వాడూ
ముక్కు సూటిగా ఉండేవాడూ.
యం ఎస్ రెడ్డి గారు..

వారి తమ్ముడు వేణు గోపాల రెడ్డి గారు 
కడపలో మంచి డాక్టరు.
ఎన్నో సాహిత్యకార్యక్రమాలను 
ముందుండి నడిపించేవారు.
ఎం ఎస్ రెడ్డి గారికి పుట్టపర్తి  వారంటే  అభిమానం 
నా ఎనిమిదేళ్ళప్పుడనుకుంటా 
నేను అయ్య రాజన్న కవీ అందరూ 
మల్లెమాల గారి కుమార్తె పెళ్ళికి వెళ్ళాం
అప్పుడు రాజన్న నాకు జడలేసేవారు..
                            
 ఆశ్చర్యం..!!
ఆనందం..!!
 

నా పేరు ఊరు దాటక ముందే..
శ్రీ పుట్టపర్తి వారి పేరు
బహు భాషాకోవిదులుగా మహాకవిగా
తెలుగు నాడు ఎల్లలు దాటింది..!!
 
వారి సారస్వత పరిశ్రమను సమీక్షించడానికి
కొండంత అర్హత కావాలి..
అంచేత..
నేనాజోలికి పోదలుచుకోలేదు..
 
నారాయణాచార్యులవారికి షష్టిపూర్తి 
జరుపుతున్నారని తెలియగానే.
ముఫ్ఫైఏళ్ళ క్రితమే తన రచనల్లో 
మహనీయమైన మానవతా దృష్టిని ..
బహుముఖ రూపాలతో గోచరింపజేసిన
సరస్వతీపుత్రుని వయసు 
ఇప్పుడరవయ్యేనా..?
అని ఆశ్చర్యపోయాను..
 
సంస్కారమున్న ప్రతివ్యక్తి శతధా ఆకాంక్షించే
పుట్టపర్తి వారి నూరేళ్ళ జీవితంలో ..
అప్పుడే అరవయ్యేళ్ళు గడిచి పొయ్యాయా..?
అని బాధపడ్డాను కూడా..
 
అయితే..
ఇంత బాధలోనూ..
నాకొకందుకు ఆనందంగా వుంది..!
అది నారాయణాచార్యుల వారికి షష్టి పూర్తి జరుగుతున్నందుకు కాదు..
ఆ సందర్భంలోనైనా వారికి
కడపలో ఘన సన్మానం జరుపుతున్నందుకు..
 
ఏమైతేనేం..
కాస్త ఆలస్యంగానైనా..
పలువురు సాహితీ మిత్రుల సహకారంతో
ప్రతిభకు పట్టాభిషేకం చేస్తున్నందుకు..
 
నా తమ్ముడు చిరంజీవి వేణుగోపాల రెడ్డి నీ
తదితర సన్మానసంఘ సభ్యులను 
మనసారా అభినందిస్తూ..
కార్యక్రమం విజయవంతం కావాలని
కోరుకుంటున్నాను..
మీ
యం.ఎస్ . రెడ్డి.