31 మార్చి, 2014

శ్రీ కొమండూరి శేషాద్రి గారు Hans India కు వ్రాసిన వ్యాసం




పుట్టపర్తి వారి అష్టాక్షరీ కృతులకు మహద్భాగ్యంగా సంపాదకత్వం వహించిన శ్రీ కొమండూరి శేషాద్రి గారు Hans India  కు వ్రాసిన వ్యాసం









 

 




28 మార్చి, 2014

వోలేటి పార్వతీశం గారి ఉపన్యాసం

మార్చ్ 28 పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 100 వ పుట్టిన రోజు అంటే శత జయంతి ఈ సాయంత్రం త్యాగరాయగానసభా ప్రాంగనంలో సభ జరిగింది అందులో వోలేటి పార్వతీశం గారి ఉపన్యాసం

24 మార్చి, 2014

అష్టాక్షరీ కృతులు ఆవిష్కార సభలో శ్రీయుతులు లక్ష్మణమూర్తి గారు


అష్టాక్షరీ కృతులు ఆవిష్కార సభలో శ్రీయుతులు లక్ష్మణమూర్తి గారు 3-1
పుట్టపర్తి అష్టాక్షరీ కృతులు గ్రంధం ఆవిష్కరం ప్రాచ్య లిఖిత గ్రంధాలయం లెఒ 21-3-2014 న అత్యంత వైభవంగా జరిగింది
సభలో పలువురు ప్రముఖులు మాట్లాడారు మీకోసం

మనలో మాట..
దీన్ని మూడు భాగాలుగా తీసాను
మూడిటినీ కలిపితే బాగుంటుంది
కానీ వీడియో జాయినర్ అనీ అవీ ఇవీ డౌన్లోడ్ చేస్తే మా పిల్లలు అమ్మ వైరస్ ఎక్కించింది అని నానా గొడవ చేస్తారు
సారీ మూడు భాగాలనూ నాకోసం భరించండి

18 మార్చి, 2014

గోమాతకు మాతకు భేదమె..


పుట్టపర్తి వారి వచన రచనా వైదుషి

                   జానుమద్ది గారి నమస్సులతో
పుట్టపర్తి వారి 
వచన రచనా వైదుష్యానికిది మచ్చు తునక..
వాద విజయములో శ్రీనాథుని చిత్రిస్తూ ..
 

''అరుణగిరినాథుడనుడను డిండిమునిపై వాదమునకు వెడలునపుడు:
కుంకుమ పూవు మేదించినది..
బొట్టు ముఖముపై కలకలలాడుచున్నది..
తెల్లటి విభూతి రేఖలు దానితో మరింత పరభాగతను సంతరించుకున్నవి..
ఆ విభూతి రేఖలు .. నా కుంకుమబొట్టు శివపార్వతులిరు వురు అతని ఫాలముననిలచి ఫక్కుమని నవ్వినట్లున్నది..
విద్వత్కవుల గుంపునుండి శ్రీనాథుడు లేచినాడు
ఆ లేచుట ..
వికసించిన తామరలున్న సరస్సునుండి జక్రవాకము లేచుటైనది..''
-జానుమద్ది హనుమచ్ఛాస్త్రి..

14 మార్చి, 2014

తెనాలి చిక్కెమునకు చిక్కితివా పాండురంగా..

రామకృష్ణుడిది ఒక ప్రత్యేక జాతి
కవిత్వం కన్నా వ్యవహార శైలితోనే అందరిదగ్గరా మార్కులు కొట్టేసిన ఘనత అతనిది
 

అతని హాస్యానికి వ్యంగ్యానికి బలికాని వ్యక్తులు లేరంటే 
అతిశయోక్తి కాదేమో

ధూర్జటి వేశ్యా లంపటుడు
పగలు రాయల కొలువు రాత్రి వేశ్యల చెలువు..
తన పధ్ధతికి తనకే అసహ్యం...
 అధిగమించలేని లోలత్వం..
కానీ కవిత్వం అద్భుతం..
 

రాయలవారు ధూర్జటి కవిత్వానికి సంతోషపడి
నీ కవిత్వానికీ అతులిత మాధురీమహిమ ఎలా కలిగిందయ్యా అని ప్రశంసిస్తే..


అక్కడే వున్న రామలింగడు ఊరుకుంటాడా
 

హా తెలిసెన్.. అంటూ వేశ్య వనితల సాంగత్యంవలన ఫుల్లమైన మనసులోంచీ ఉద్భవించిన కవిత్వమది అతులిత మాధురీమహిమ లేకుండా యెలా వుంటుందీ.. అని
ఆ హాశ్చరానికి అర్థం విడమరిచాడు
ధూర్జటిపై ద్వేషమా పగా కాదు స్వభావం అంతే..
 

''స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?''

 
''హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ''


 ఒకసారి కుంజర యూధంబు దోమకుత్తుకజొచ్చెన్ అని పూరణను రాయలవారు రామలింగడు లేని సమయంలో ఇచ్చారట...
ఎవ్వరూ పూరింపలేకపోయారు
ఏనుగుల గుంపు దోమకుత్తుక జొచ్చడమేమిటీ..
 

ద్వారపాలకునితో మిగిలిన కవులు అడిగించారు తెనాలిని
అడిగింది ద్వారపాలకుడు 

దానికి రామకృష్ణుని సమాధానమెలా వుంటుందీ..?
 

''యేరా ఫుల్లుగా కల్లుతాగి పేలుతున్నావా..
 కుంజరయూధంబు ఎట్లా దోమ కుత్తుక జొస్తుందిరా..
 తలతిక్క వెధవా ..''
అని దులిపేశాడు..
 

అదే మళ్ళీ రాయలవారడిగారు
ఇందాకట్లా నోరు చేసుకోడానికి లేదు
కాబట్టీ 

అందులో పంచపాండవులు.. వా రి దుర్విధి..
విరాట కొలువున దాగిన వైనం..
కథలో జొరబడ్డాయి ..
ఆటో మాటిగ్గా 'కుంజర యూధంబు దోమ కుత్తుక' లోకి వెళ్ళిపోయింది..
 ఇది జీవితం ఇక అతని కవితలో ఆ హాస్యం 
ఎలా ప్రతిఫలిస్తుంది..

 ఇలాంటి హాస్య దృష్టి గలవాడు చెప్పిన కవిత్వంలో 
అది భక్తి అయినా కరుణ అయినా దుఃఖమైనా సరే.. 
హాస్య ఛాయలు దూరి తిష్ట వేస్తాయి
వారేంచేసినా సరే..
ఇలాంటిదే క్రింది సందర్భం..


ఉదాహరణకు చూడండి

 పుండరీకుడు తపస్సు చేస్తున్నాడు..
దేవుడు ప్రత్యక్షమయ్యాడు
 

సాధారణంగా ఎవరైనా భగవంతుని రమ్మంటే సందర్భాన్ని బట్టి 
ఆయన వెనకా ముందూ వస్తాడు..
అన్నమయ్య 

'అంతర్యామీ అలసితి సొలసితి..' ఇంక రావయ్యా అంటేకానీ రాలేదు
త్యాగయ్య
 'నగుమోమూ గనలేనీ నా జాలి తెలిసీ.. నను బ్రోవ రారాదా..' అని తల్లడిల్లి పోయాడు

'జగమేలే పరమాత్మా ఎవరీతో మొరలిడుదూ 
వగ జూపకు తాళను నన్నేలు కోరా.. '
అనిబేజారు పడితే కానీ రాలేదు..
గజేంద్రుడు రమ్మంటే మాత్రం..
సిరికింజెప్పడు.. శంఖ చక్ర యుగముం జేదోయి సంధింపడు ..
అన్నట్లు ఆదరా బాదరా వచ్చేసాడు.. 
 
అర్జెన్సీని అర్థం చేసుకోవాలి కదా ..

మరి తెనాలి వాని పరమాత్మ ఎలా వచ్చాడు..?
రుక్మిణిని మరచిపోయాడేమో కానీ చిక్కాన్ని మరువలేదట
చేతిలో శంఖం వెన్నముద్దలా వుందట..


వావ్..
ఒక్కసారి చలిది చిక్కాన్ని పట్టుకుని 

ఒక చేతిలో వెన్నముద్దతో వచ్చిన కృష్ణుని ఊహించుకోండి..
 

జాలరులు వలలతో చేపలు పడతారు
హరి మీనావతారుడు..
కాబట్టీ ఋషులు యేం కావాలి జాలరులే గదా..
ఆ జాలరులకు వలలు..?
ఋషులకు వలలింకేం ఉంటాయి

 సర్వ సంగ పరిత్యాగులు 
అందుకు వారి భక్తియే వల
అదే చలిది చిక్కెం..
 

వచ్చిన వాడు బాల కృష్ణుడు
ఆయనకు ఇష్టమైనవి పాలు పెరుగు వెన్న పెరుగన్నపు చిక్కెమది..

అందుకే ఆ కృష్ణుడు రుక్మిణిని మరచినా చిక్కాన్ని మరువలేదు..  అంతేనా..
బహుశా అంతేనేమో..


తెనాలిరచనలోని హాస్యాన్ని 
మనకు పరిచయం చేస్తున్నారు పుట్టపర్తి
పుట్టపర్తి కూడ తెనాలిని బాగా ప్రేమించారనుకుంటా
అందుకే వారి చాలా రచనలలో తెనాలిని మరచిపోలేదు



                                   తెనాలి రామకృష్ణుని హాస్యము
                                శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
 

రామకృష్ణకవి స్వభావమే హాస్యమయము. 
ఆతడే యుపమానము చెప్పినను యేమాట యన్నను దానిపైన గొంత హాస్య రస చ్ఛాయ యుండవలసినదే.. 

కుమారస్వామి వెంట ఈశ్వర దర్శనార్థమై ప్రమధగణములు గదలినారు.
వారి యాభరణములు వర్ణించినాడు కవి..
 

వారి వైభవము మనకు దెలియును గదా..
పాములు.. 

కపాలములు.. 
పులి చర్మములు..
అవి యట్లుండనీ..
ఆ యాభరణముల నడిమ
"బురుపారగమేను బూదిబూసినారు" అన్నాడు..
 

వారు విభూతి బూసికొన్నారట..
అది యెట్లున్నదనగా.. బూజు పట్టినటులున్నదట..
 

శ్రీనాధునివంటివాడది చూచిన 
రామకృష్ణుని యీ లోకమున నుండనివ్వడు..
 

శ్రీమహావిష్ణువును బుండరీకుడు గాఢముగ ధ్యానించునపుడాతని ధ్యానదృష్టిలో
గృష్ణ భగవానుడుదోచునట.. 


అపుడా కృష్ణుడు రుక్మిణినైన మరచినాడుగాని..
చలిది చిక్కమును మాత్రము 

దగిలించుకొనియే వచ్చినాడు..
 

ఆ చిక్కము..  
ఆయన ముందు మీనావతరమైనందున 
ఆ మహామహుని బట్టుటకు 
మునులు వేసిన భక్తియనెడు వలవలె నున్నదట..
 

చేతిలోనున్న శంఖము 
వెలితిగా జవికొన్న వెన్నముద్దయనిపించినది..
 

ఇంతలో బుండరీకుని దల్లిదండ్రులు గతించినారు..
పుండరీకునకు సత్సంతానమై పితౄణము దీరినది
సంసారపు జంజాటము జాలించుకొని 

వాడు దైవమునకై బాసిక పట్టుపట్టినాడు..
 

అతి కఠోరమగు దపస్సును 
అనేక వత్సరములు గావించెను..
కృష్ణుని యాటలన్నియు సాగినవికావు.. 

అతనికి దర్శనమివ్వవలసివచ్చినది..
 

పరమాత్మను చూచిన వెంటనే పుండరీకుని 
యనంద మింతింతగాదు..
"క్రొత్త పులునేపున.." 

పులకలు శరీరమున వించినవి
చాల తడవు మాటాడలేకనే పోయినాడు కడకు..
''దేవ అస్మాకం శరణం త్వమేవ గతి రన్యోనాస్తి దుర్వాసనా పస్మారం హరా''
అని అమాంతముగ అడుగుల మీదబడినాడట..
 

ఇంత రసోన్మాదముననుసరించిన పుండరీకుడు విష్ణుస్తుతి నారంభించినాడయ్యా..
అతని మొదటి వాక్యము వినుడు..
సీ.  ''పొదలునీ పొక్కిట పువ్వు కాన్పు నగదా
పెను మాయ పిల్లలు బెట్టుటెల్ల.. ''     2-55
 

ఇది చదివిన వెంటనే 
పాఠకునకు ఫక్కుమని నవ్వు వచ్చును..
 

అంతకు ముందు వాడనుభవించుచూ వచ్చిన తాదాత్మ్యము దూదిపింజవలె నెగిరిపోవును. 

నారద మహర్షి యొక్క "యెర్రని జడలు" 
''సుషుమ్ననాడి యీనిన పిల్ల వెలుగున పడుపున'' నుండెనట.. (2-172)
 

మండుటెండలో దపించు బుండరీకుడు 
కడుపుబ్బించి లింగము వలె నున్నాడట..
శ్రీ మహావిష్ణువు భవన ఘటనకు మొదలికంబమువలె సర్వలోకమునకు బ్రధానుడట..
యీ రీతి నతడేది జెప్పినను కొంత హాస్యమే నడచును..
శంకరునిచే తత్త్వబోధను వినునవకాశమును బోగొట్టుకొన్న నారదుడు
 

ఉ .డక్కిన విష్ణు భక్తియు దృఢంపు విరక్తియు గల్గు నమ్మరు
ద్బుక్కటకున్ భజించు మతి పుట్టక కంపలబడ్డకాకినై
యక్కట మోసబోయితిగదా..
అని పశ్చాతాప బడును 

నారదుని తాపమెట్లయిన నాయె, 
దీని జదివినంతనే మనకు నవ్వు వచ్చును 

కాపు కోడలు దన్ను వలచుచున్నదని  
తెలిసినంతనే నిగమశర్మ
 

''భళిరా తేరకుతేర దక్కెనిటు లీ బంగారుకుండంచు జం
కలు దాటించుచు కెంపు మోవి దొడుకంగా గుబ్బ పాలిండ్లు బి
ట్టలరంగా ముఖగంధ పారణము సేయంగా.. ''    3-67
 

లొట్టలు వేసినాడట..
 

ముఖ గంధ పారణ శబ్ద నిర్మాణమ్న నెంతో హాస్యమును 
దొడుకంగా అలరంగా సేయంగా అను నూతన పదములలో గంపెడు హాస్యమునున్నది

(తెలుగు తీరులు -తెనాలి రామకృష్ణుని తెలుగు కవిత పుటలు)

11 మార్చి, 2014

విశ్వనాధ రామాయణాన్ని గురించి



ఒకసారి ఒక సభలో విశ్వనాధ రామాయణాన్ని గురించి 
పుట్టపర్తి యేంచెప్పారో పై వీడియో చెబుతుంది


పుట్టపర్తీ విశ్వనాధ ఇద్దరూ రామయణం వ్రాసారు
విశ్వనాధ వ్రాసాడని 

పుట్టపర్తీ రామాయణం వ్రాసాడని అనేవాళ్ళూ
విశ్వనాధ రామాయణం పండితులకే ననీ
పుట్టపర్తి రచన అందరికీ అనీ యేవేవో మాటలు
ముందు రామాయణమనే పేరు పెట్టారనీ తరువాత జనం దానికి జనప్రియ జోడించారనీ కొందరి వాదన
 

కానీ పుట్టపర్తి మాత్రం
తులసిదాసు రామచరిత మానసమటువంటిది 

తెలుగులో రావాలని చేశానన్నారు
మాత్రాఛందస్సులో వ్రాయటానికి 

సంగీతమంటే ఉన్న పిచ్చే కారణమనీ చెప్పుకున్నారు
 

''పద్యాలు కూడా సంగీతంగా చదవవచ్చు..
కన్నడదేశంలో గమక ప్రక్రియలోనే కావ్యాలను చదువుకౌంటూ 

జీవితం గడుపుకుంటూ వుండేవాళ్ళు..
 

శఠగోపాచార్యులని ఒకాయన..
ఆయన యేమీ చేయడు 

కుమార వ్యాసుని భారతం 
గమక ప్రక్రియలో మాత్రమే చదువుతాడాయన
పోయిన చోటల్లా జనాలు ఉదారంగా చందాలు ఇస్తారు 

ఆయన బతికినాడు ''
అంటారు పుట్టపర్తి

రామాయణాలు ఎన్నో

 మళ్ళీ రామాయణమెందుకు
అన్న వాదానికి

 ప్రతీ రోజూ తిన్న అన్నమే 
అని తినడం మానేయడం లేదు. 
సంసారంలో కష్ట సుఖాలున్నాయి కదా అని 
మనం మానేయడం లేదు. 
మన పిల్లల ల్నీ సంసార బంధంలోకి లాగుతున్నం కదా. 
అలాగే ఎవరి అనుభూతులు వారివి. 
ఈ రామాయణం నా అనుభూతి. నా రసాస్పందన
 ఇది విశ్వనాధ భావన
పుట్టపర్తికి సన్నిహితుడైన v.p రాఘవాచార్యులేమంటారో విందాం..  


1954 లో నేనొక నెల రోజులు మైసూరులో ఉన్నాను
అక్షరాస్యులైన వయోజనులకు పనికివచ్చే 

పుస్తకాలు వ్రాయాలనే ఒక పథ కం ప్రకారం
యునెస్కో వారి ఆర్థిక సహాయంతో 

కేంద్ర ప్రభుత్వం వారు
మైసూరులో ఒక రచయితల వర్కు షాప్ నిర్వహించారు
 

తెలుగువా రిలో హైద్రాబాదు రాష్ట్రం నుండి 
నన్ను మరొక ఉపాధ్యాయుని ఎన్నుకొని 
ఈ వర్కుషాప్ కు పంపారు
 

ఆనాటి మైసూరు రాష్ట్రంలో వయోజన విద్యా కార్యక్రమం ఒక స్వచ్చంద సంస్థ చక్కగా నిర్వహించేది 
దానిపేరు వయస్కరణ శిక్షణ సమితి  అని జ్ఞాపకం
ఆ సమితి కోరికపై పుట్టప్ప గారు 

జనప్రియ వాల్మీకి రామాయణం సంగ్రహంగా వచనంలో వ్రాశారు
అక్షరాశ్యులైన వయోజనులు  

తమ జన్మ సఫలం కావడానికి తాము చదువగలిగిన రామాయణం కావాలని కోరారట.
ఆ కోరికని పురస్కరించుకొని 

పుట్టప్పగారు రామాయణం వ్రాసారు
 

నేనెపుడో 1956 ప్రాంతాలలో అనుకుంటాను 
శ్రీ పుట్టపర్తికి చెప్పాను.
ఆయన జనప్రియ రామాయణం అనే పేరు 

నేను చెప్పినాక పెట్టారో 
అంతకు పూర్వమేపెట్టారో నేనెరుగను
 

పుట్టప్ప అప్పుడు వ్రాసినది ఒక చిన్న పుస్తకం
పుట్టపర్తి వ్రాసినది అద్భుతమైన మహా కావ్యం
ఆయన ఎన్నుకున్న ఛంధస్సు
పాడుకోవటానికి అనుకూలమై 

కావ్యానికి ఎంతో శోభను చేకూర్చింది
అచ్చు అయిన తరువాత ఆ పుస్తకాలను నేను తెప్పించుకొని  చదివాను.

5 మార్చి, 2014

బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం

ద్రావిడ విశ్వవిద్యాలయం జరిపిన శతవసంత సాహితీకీర్తి పుట్టపర్తి సభలలో మొదటిరోజు బూదాటి వెంకటేశ్వర్లు గారి ప్రారంభోపన్యాసం

కృతాకృత చింతలు


వేమనపై రూమరులా



కట్టుకథలు ..
అనగా కల్పించి దానికి కొంచెం మసాలా తగిలించి 

చెప్పే కథలు
యీ కథలు సినిమా వాళ్ళకూ రాజకీయ నాయకులకూ ఆఖరికి పైకొచ్చిన ఎవరిపైనైనా అల్లుతుంటారు
 

అల్లూరిసీతారామరాజు విప్లవ యోధుడు
ఆయన పై కృష్ణ సినిమా సూపర్ హిట్టు 

వాస్తవంలో ఆయన సీతారామరాజు కాదు 
శ్రీ రామరాజు
ఆయనకు సీత అనే చెల్లెలు 

ఆమెకు బాల్యంలో భర్త పోతే  రామరాజు బాధపడి 
తన శ్రీ ని సీతా అని మార్చి చెల్లెలి పేరునూ 
తనతో కలుపుకున్నాడు
 

మరి అంత విప్లవ నాయకుని జీవితం చప్పగా వుంటే 
సిని మా ఎలా ఆడుతుందీ 
అందుకు వాళ్ళు చెల్లిని  ప్రియురాలిగా మార్చేసారు..
సినిమా వాళ్ళకు వాళ్ళ సినిమా సక్సెస్ కావాలంతే..



హాస్యానికి కేరాఫ్ అడ్రెస్స్ గా చెప్పబడే 
తెనాలి రామలింగనిపై కూడా బోలెడు కట్టుకథలు పుట్టుకొచ్చాయట
కట్టుకథలేగాక ఎవరో నడిపిన కథలనూ కూడని పద్యాలనూ పెద్దవారికంటగట్టి కొందరు  వినోదం చూస్తారట..



పదునైదవ శతాబ్దంలో కవయిత్రులెవ్వరో మనమెరుగము
రామాయణము వ్రాసిన మొల్ల రాయలకాలమునాటిదందురు..
ఎంతవరకు నిజమో..
యీ కవయిత్రితో కొంటెకోణంగి తెన్నాలి రాముడు 
కొంత పిల్లా టలాడెనని కొన్ని కట్టుకథ లు
రామకృష్ణుని నెత్తిపై కెత్తబడినపుక్కిటిపురాణముల జూచినచో నయ్యో ననిపించును..
మనకు సాహిత్యములో నెక్కవగా అదవకు దొరకిన వ్యకులు ముగ్గురు

మొదటివాడు శ్రీనాధుడు
రోతపుట్టించు బూతు శృంగార పద్యములన్నియు 
చచ్చిన శ్రీనాధునిపై వేసి సవరించుకొందుము

ఇక అసహ్యకరమైన హాస్యమునకు 
మనకు దొరకిన దృష్టిబొమ్మ తెన్నాలివాడు
ఈతని జతలో చేర్చి తిరుమల తాతయ్య వంటి 
పవిత్ర మూర్తిని గూడ పాడుచేసితిమి

ఇక శని వక్రించిన మూడవ వాడు వేమన్న.
అందచందములేని వేదాంతమంతయు నాతని నెత్తిపై వేసి
పద్యము కడపట వేమా అని తగిలించినచో 
మనపీడ వదలి పోవును 

పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం



కుప్పం లోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో 
పుట్టపర్తి వారి శతవసంత సాహితీ కీర్తి పుట్టపర్తి 
ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. 
అందులో నాకు నచ్చినవి పెద్దల వీడియోలు 
కొన్ని విద్యార్థులు వ్రాసిన వ్యాసాలు కొన్ని తీసుకొచ్చాను. 
మీకోసం 
ఇదిగో ప్రొఫెసర్ శ్రీ బూదాటి వేంకటేశ్వర్లు మరియు
 శ్రీ గొల్లాపిన్ని శేషాచలం గార్ల ప్రసంగం


రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రెండవరోజు సభను నిర్వహించిన శ్రీ దామోదర నాయుడు గారి ప్రసంగం వీరు తెలుగు ప్రొఫెసర్ గా పదవీ విరమణ తరువాత ప్రస్తుతం TTD లో పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.