2 ఫిబ్ర, 2014

పిబరే రామరసం


ఒకసారి విశ్వామిత్ర మహరాజు 
వశిష్టుని దర్శించటానికి వచ్చాడు
వెంట మహా సైన్యం..
వశిష్టుల వారిని సేవించి
కొంతసేపు అవీ ఇవీ మాట్లాడి 

వినయాను సంధానం చేసిన తరువాత..
ఇక బయలు దేరతానన్నాడు.
 

వశిష్టునికి విశ్వామిత్రునిపై అనుగ్రహం హెచ్చి
'మీరు మా ఆతిధ్యం స్వీకరించి వెళ్ళాలని 'కోరాడు
విశ్వామిత్రుడు
'వద్దులెండి..
మీరు తాపసులు..

 మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు.
ఊరకే మీ ఆశీర్వాదం కొరకు వచ్చాను ..
సెలవీయండి వెళతా'నన్నాడు
 

కానీ వశిష్టుడు
'మీరు మా అతిధి 

నేను గృహస్తును మీరు ఆతిధ్యం స్వీకరించాల్సిందే '
అని మొహమాట పెట్టాడు
'గురువుగారూ నేనొక్కడినే కాదు 

నావెంట బోలెడు సైన్యం వుంది..
అర్థం చేసుకోండి' అని విశ్వామిత్రుడు అనేలోగా
 

'మరేం పర్లేదు..
మీకు మీ సైన్యానికీ కూడా ఆతిధ్యమిస్తాం..'
అన్నాడు చిరునవ్వుతో వశిష్టుడు
 

'పెద్ద చిక్కొచ్చిందే .. 
వీళ్ళ దగ్గర మందీ మార్బలం లేవు
కావలసిన సరంజామా లేదు..
ఎలా ఈయన ఆతిధ్యం ఇస్తా .. ఇస్తా .. అంటున్నాడు..?'

అని ఆలోచనలో పడ్డాడు విశ్వామిత్రుడు..
 

'శబలా  'వశిష్టుడు పిలిచాడు
పిలవటమేమిటి ఒక ధేనువు వచ్చినిలబడింది
విశ్వామిత్ర మహారాజు అతని సైన్యం మన అతిధులు వీరిని తృప్తి పరచవలసిన బాధ్యత నీదే.. అని ప్రశాంతంగా చూచాడు ధేనువు వంక..
 

ఎన్నో రుచికరమైన పదార్థాలు 
ధేనువులోంచీ ఉద్భవించాయి
విశ్వామిత్రుడు ఆశ్చర్యంతో అలా చూస్తూనే వున్నాడు
సైనికులందరికీ మృష్టాన్న భోజనం అందింది..
భోజనానంతరం అందరూ వెనుదిరగాలి కదా
 

ఇప్పుడు 
విశ్వామిత్రుని మనసులో విషపుటాలోచన
ఆధేనువు తనది కావాలను కున్నాడు
 

వశిష్టుడిని ధైర్యంగా అడిగాడు కూడా
'యీ శబల ను నాకివ్వండి బదులుగా ఎన్నో కానుకలిస్తానన్నాడు'
వశిష్టుడు ఒప్పుకోలేదు

'ఇది నా హోమ ధేనువు ఇవ్వ'నన్నాడు..  
'నేను రాజుని ..
తన రాజ్జంలోని యేవస్తువుపైనైనా
 ప్రధమాధికారం రాజుకే కనుక
యీ శబల  పై అధికారం నాదే..
మర్యాద ఇస్తే ఇవ్వు ..

లేకపోతే బలప్రయోగం చేస్తా'
 

వెంటనే పదిమంది సైనికులు ఆధేనువును 
బలవంతంగా లాక్కుపోతున్నారు
ఇంతలో ఆ ధేనువు వారిని విడిపించుకుని

 పరిగెత్తుకుని వశిష్టుని సమీపించి
 

'మీకై మీరే నన్ను ఆ రాజు స్వాధీనం చేసారా
లేక బలవంతంగా వాళ్ళు నన్ను తీసుకుపోతున్నారా' 'అని అడిగింది
'నేను నిన్ను వదులుకో లేదు
వాళ్ళు నిన్ను బల ప్రయోగంద్వారా సొంతం చేసుకోవాలనుకుంటున్నారు'
అన్నాడు బ్రహ్మర్షి
 

అంతే శబల అగ్రహోదగ్ర అయ్యింది
ఆమె చెవులు కళ్ళు తోక పృష్టి పాదాలు గిట్టలు 

మొదలైన ప్రదేశాలనుంచీ 
వందలు వేల సైనికులు పుట్టుకొచ్చారు
విశ్వామిత్రుని సైన్యాన్ని చీల్చి చెండాడారు..
నిశ్చేష్టుఁడు  విశ్వామిత్రుడు 


వశిష్టునిది తపోబలమని గుర్తెరిగి
తపస్సుతో తానూ దాన్ని సాధించి 

తన మాట చెల్లించుకోవాలనుకున్నాడు
 

వెంటనే
తీవ్ర తపస్సు
పరమశివుని కై  
 శివుడు  ప్రత్యక్షం 
నాకు ధనుర్వేదంలోని సర్వ అస్త్రాలు.. 
 సాంగోపాంగంగా  ఇప్పటికిప్పుడు అనుగ్రహించమని కోరిక
విషయాన్ని గ్రహించిన శివుడు 

తనలో తను నవ్వుకున్నాడు 
తధాస్తు అన్నాడు
 

రెట్టించిన ఉత్సాహంతో 
తిరిగి వశిష్టుని ఆశ్రమానికి వచ్చిన విశ్వామిత్రుడు
తన అస్త్రాలన్నీ ప్రయోగించాదు
 

అన్నిటికీ వశిష్టుని బ్రహ్మదండమే సమాధానం చెప్పింది
విశ్వామిత్రుడు ప్రయోగించిన సర్వాస్త్రాలూ బ్రహ్మదండంలోకి చేరిపోయాయి
బ్రహ్మ బలం ముందు క్షత్రియ బలం ఓడిపోయింది
 

తరువాత జరిగిన కథలో విశ్వామిత్రుడు
బ్రహ్మర్షిత్వాన్ని సాధించాడు
గాయత్రీ మంత్ర కర్త అయ్యాడు
త్రిశంకు స్వర్గన్నే సృష్టించాడు..
హరిశ్చంద్రుణ్ణి పరీక్షించి వదిలాడు


ఇక్కడ చెప్పేదేమంటే
 ఎంతటి రాజాధిరాజులైనా 

భక్తులతో తప స్వులతో చెలగాటమాడారా
వారు పాములతో చెలగాటమాడినట్లే
అందరిలోనూ ఆ సర్వేశ్వరుని చూస్తూ 

సాధుజీవనం గడిపే భగవద్భక్తుల 
మనసు నొప్పించి ప్రవర్తిస్తే
ఇడుముల పాలు కావలసిందే..
 

తులసీ దాసు అక్బర్ నడుమ జరిగిన యీ ఉదంతం మనకిదే చెబుతుంది..


 అక్బరు తులసీ దాస్ వద్దకెళ్ళాడు
రామ దర్శనం ఇప్పించమన్నాడు
రామ దర్శనం అంత సులభంగా జరిగేది కాదు
కామ క్రోధాదులు జ్ఞానాగ్నిలో భస్మీపటలం అయితేనే రాముడనుగ్రహిస్తాడు
అనేక జన్మ వాసనా వాసితములైన కామ క్రోధాదులు అల్ప ప్రయత్నములతో నశింపవు
రాముని చేరుటకు రామభక్తి ఒక్కటే రాజమార్గం
ఆ దారిన పయనింప మొదలిడు
నీ తపన ఎంత తీవ్రమైతే గమ్యమంత చేరువవుతుంది అని చెప్పాడు తులసి
వెంటనే అక్బర్ కు తన చక్రవర్తిత్వం గుర్తొచ్చింది
ఫలితంగా తులసీదాస్ చెరసాల పాలయ్యాడు
ఆపైన యేం జరిగింది..?
తన భక్తుడు తులసీదాసు ను ఆ రాముడెలా రక్షించుకున్నాడు ..
 

పుట్టపర్తి వారి 'రాయల నీతి కథలు' లోని 
ఈ తులసీ దాసు ను  చదవండి..