19 మే, 2014

నిండు నదులు పాఱు నిల్చి గంభీరమై


మా కడపలో సాహిత్య సభ జరిగితే..
జనంతో ప్రాంగణం కిట కిట లాడిపోయేది..
పైగా రెండు మూడు గంటలు నిలుచుని 
కార్యక్రమం చూసే వాళ్ళు
 
హైదరాబాద్ లో సాహిత్య సభలను చూస్తే
 ఆశ్చర్యం వేస్తుంది
ఒక ఇరవై మంది ఉంటే గొప్ప..
వాళ్ళు కూడా టైమవుతున్నకొద్దీ చల్లగా జారిపోతుంటారు..
 
చివరికి..
అధ్యక్షుడూ వక్తలూ మైక్ సెట్ వాళ్ళూ మిగులుతారు
మైక్ సెట్ వాళ్ళూ చిట చిట లాడుతుంటారు 
త్వరగా కానివ్వండని 
నన్నయ తిక్కనాదులు ఏమంటే వాళ్ళకెందుకు .. 
వ్యాస కాళి దాసాదులు ఎటు పొతే వాళ్లకేమిటి .. 
ఎనిమిదిన్నరకి వాళ్ళ డ్యూటీ అయిపోవాలన్తే
 
 యేడు యేడున్నరదాకా మొదలవనే అవదూ
 ఎంత గొప్ప సభ అయినా ఎనిమిదిన్నర లోగా అయిపోవాలి..వాళ్ళు కూడా వాచీ చూసుకుంటూంటారు..

అంత పస వున్న వాళ్ళూ లేకపోవటమూ కారణం కావచ్చు..
మావూరికి  ఎందరెందరో సాహితీ  మేరువులు వచ్చారు
పురమూ పురజనులూ పులకించిపోయారు
పుట్టపర్తి సభల్లోని పేపర్ కటింగ్స్ చూస్తే మీకే అర్థమౌతుంది..