25 మార్చి, 2016

ఆలయ లయలు



విజయనగర వైభవం గురించి మీ అయ్య నోటనే వినాలి అని అందరూ చెబుతుంటే
ఆశ్చర్యంగా వుండేది
కానీ ఒక్కో పుస్తకం తెరిచి చూస్తే చిరునవ్వుతో మా అయ్య
ఎన్నో సంగతులు మళ్ళీ చెబుతున్నారు

నిన్న విజయనగరాన్ని గూర్చి కొంత చెప్పారు కదా..

ఈరోజు ఆలయాల గురించి విందాం..
మాతంగ పర్వత శిఖరం నుండి 
పట్టణావరణాన్ని పరిశీలిస్తే .. 
అనేక గోపురాలు కనిపిస్తాయి 
అవి అన్నీ ఆలయ గోపురాలే 
పూర్వం ఎన్ని ఆలయా లుండేవి .. చెప్పలేం .. 
మహమ్మదీయులు ధ్వంసం చేసినవి పోగా 
మిగిలినవే సుమారు నూరు వరకున్నాయి 
ఇన్ని ఆ లయలెందుకు ..? అని మనకనిపించ వచ్చు . 
కొం చెం నిదానం గా ఆలోచిస్తే .. 
దానికి కారణాలు కనిపిస్తాయి .. 

అప్పటి వారికి మతాభిమానం ఎక్కువ .. 
అది మనకు ఇప్పుడు ఆలోచించ డానికి కూడా సాధ్యం కాదు .. 
అందుకే చెక్కడానికి వీలున్న ప్రతి శిల నూ 
దేవతా విగ్రహాలు చేసారు .. 
చివరికి నదీ తీరాన ఉన్న శిలలూ నందులు .. లింగాలు .. 

అంతేకాదు .  
పుర ప్రదేశ నైసర్గిక స్థితి వలన కూడా ఆలయ సమాఖ్య ఎక్కువే 
రాజులు ఒక్కొక్క వీధి కొక్కొక్క దేవాలయం 
ఇంకో విషయమేమంటే 
తురుష్కుల వైషమ్యం వలన విగ్రహారాధన పెరిగి వుండవచ్చు . 
వారు విగ్రహారాధన కు వ్యతిరేకులు కదా . 

అంతేనా 
మనలో ఆలయ నిర్మాణం .. దేవతా ప్రతిష్ట 
మహా పుణ్య కార్యాలుగా ఈనాటికీ భావిస్తున్నాం 
మరి రాయలేలిన కాలంలో 
హిందు మతం ఉజ్జ్వలంగా పరిఢవిల్లిన రోజుల్లో 
అది మరింతగా ఉండేది 
ధనికులు తమ శక్తిని బట్టి ఆలయాలను నిర్మించి వుంటారు .. 
మనకు దేవతల సంఖ్య కూడా ఎక్కువే కదా 

కాని పుట్టపర్తి ఏమంటున్నారంటే . 
కేవలం మతాభిమానమే కారణం కాదట .. 
అది ముఖ్యోద్దేశ మైనా .. 
శత్రువులు జోరబడితే .. 
ఆ వీధిలో ఉన్నవారు తలదాచు కోటానికి ఏర్పరచిన కోటలేమో .. 
అని చాల సార్లు వారికి తోచిం దట .. 

అది ఏ ఉద్దేశ మైనా వీధి ప్రజలకు రక్షణ .. 
దేవతా విగ్రహా లకు కాపలా .. 
అప్పటి ఆలయాలు ఎంతో విశాలంగా మనకు కనిపిస్తాయి 

గర్భ గుడి చుట్టూ చీకటి కోణ ములుగ కొన్ని ప్రదక్షిణ స్థలాలున్నాయి 
అవి ఈ ఊహ ను ఇంకా బలోపేతం చేస్తున్నాయి 

కొన్ని వందల మంది దాగి కొంత కాలం పోరాడ వచ్చు 
ఇది ఊహ కావచ్చు 
నిజం కావచ్చు.. 

ఇంక ఆలయ నిర్మాణం ఎంత పటిష్టం గ వుందో చూద్దాం 
ఉన్నత ప్రాకారాలు 
గోపురాలు 
ప్రాకారాలు కేవలం గోడలు కాదు.. 
ఆ గోడలు మూడు పొరలు 
లోపలా వెలుపలా రాతి గోడలు 
నడుమ ఇటుకలు సున్నము తో గోడ 
అవి ఆ రాతి గోడలు ఎలాంటివి 
పొరలవి పొడవు మందము కలిగినవి 
అందులో అందమైన బొమ్మలు 
''రాతికి రాతికి కప్పు లు తీసి కూనములు బిగించి రి ''
 సున్నముతో గట్టలేదు  అన్నారు . 

అందుకే ఎవరైనా వానిని పడగొట్టా లంటే 
మొదట రాతి గోడను తర్వాత ఇటుక గోడను 
చివరి రాతి గోడను పగల గొట్టా లి .. 
అప్పుడే ప్రాకారం పడిపో తుంది 
ఆ గోడలు కోటల్లా ఉండా ల ను కొని  కట్టారా లేదా .. ??
సరే 
ఆలయాల లోపల ప్రవేశిస్తే .. 
విశాల మైన ఖాళీ స్థలం 
అందులో వందల మంది నివసించవచ్చు .. 
అందులో ఎన్నో మంటపాలు .. 
వానిపై మళ్ళీ అలరించే శిల్పాలు 
ఆలయమం తా రాతి కట్టడమే .. 
నేల మాళిగల సంగతి సరే సరి 
మొన్న అనంత పద్మ నాభ స్వామి సన్నిధిలో దొరికిన సంపద ఇందుకు సజీవ సాక్ష్యం .. 
కామలా పురం లో మా అక్క వుంటుంది 
వాళ్లకు పొలాలున్నాయి అక్కడ 
ప్రతి రోజు ఆ దారినే ఆమె కొడుకు నడచి పోతాడు 
పొలానికి 
గవర్నమెంట్ కు పేద్ద జడ దొరికిందట బంగారపుది .. 

సరే .. 
దూలాల కింద 
పట్టె ల కింద 
పైన ఆ చూరు రాళ్ళు 
నలభై యాభై అడుగుల పొడవు .. రెండడుగుల  వెడల్పు 
వీటిని నేలపై ఒక పది అడుగులు కదిలించా లంటేనే 
 క్రేన్ లు కావాలి
ఎంతో మంది మనుషులు కావాలి 
ఊరికే కదిలించాలంటే ఇరవై పలుగులు కావాలి 

మరి అంతంత బరువైన శిలలు 
పన్నెండడుగులు .. ఇరవై ముఫై అడుగులు 
ఎలా పైకెత్తి వుంటారు 
కొలతలు తప్పకుండా ఆయా చోట్ల ఎలా నిల్పారు .. 
ఆశ్చర్యంగా లే దూ 
వాళ్ళు మనుషులా రాక్షసులా లేక దేవతలా .. 
సమాధానం ఊహించా ల్సిందే కాని 
ఇప్పుడు జీవించి ఉన్నవారు ఎవ్వరూ జవాబు చెప్పలేరు 

ఒక పాశ్చాత్యుడ న్నా డ ట .. 
' ఏ విద్యుచ్చక్తి చేతనో ఆ రాళ్ళను బై కెత్తి నిలిపిరి '
ఆ ఆశ్చర్యం పుట్టపర్తికి చాల కాలం ఉండింది 
ఎనిమిది సార్లు సందర్శించి ఒక చెంగ ప్ప ను పట్టుకున్నారు 
దానికతడు తడుముకోకుండా 
తెలుగు అందులో అచ్చ తెలుగు లో 
కడు  చక్కగ 
'అదే మబ్బురం సామీ .. 
మేరువలు గట్టి పైకి దొబ్బిరి '
అన్నాడట .. 
ఇంకా సందిగ్ధంగా ఉన్న సామి ని చూచి 
'మే రువ గట్టి గట్టి దూలాలు ఏట వాలుగ బెట్టి రాళ్ళను పైకి దొబ్బిరి '
అని ఇంకా విశదం గ చెప్పాడట 
యుక్తికి సరి పోయింది 
యుద్ధాలు లేనప్పుడు ఏనుగుల తో 
ఇటువంటి పనులు చేయించే వారు 
విఠలాలయం మొదలైన చోట్ల సుమారు మూడు వందల  సంవత్సరాల నాడు వేసిన రంగులు 
ఈ రోజుకు మిరుమిట్లు గొలుపుతున్నాయే .. 
వాటిలో ఏ రసాయనాలు కలిపారో 
ఈనాటి వ్యాపార వేత్తలు ఊహించ గలరా.. 

ఇక విగ్రహాల గురించి మళ్ళీ మాట్లాడదాం .. 

23 మార్చి, 2016

పుట్టపర్తి గైడైతే ఎలా వుంటుంది .. ??





మన మెక్క డైనా  చారిత్రిక స్థలానికి పోదలిస్తే . . 
'రైళ్ళు బస్సుల ఫెసిలిటీ యేమన్నా వుందా '
అని చూస్తాం
తర్వాత రిజర్వేషన్ 
ఆ రోజుకు సర్దుడు కార్యక్రమం చేసుకుని
పిల్లలతో ప్రయాణమౌతాం
రైలు దిగిన వెంటనే మంచి హోటల్ వేట
దిగి .. స్నానం రెస్ట్..

తాము చూడదలచుకున్న ప్రదేశాలకు 



తాము చూడదలుచు కున్న ప్రదేశాలకు 
యేవైనా కార్లు లేక పోతే టూరిస్ట్ శాఖ వారి సదుపాయాలు
అక్కడ కూడా మనం చల్లగా సేద తీరడానికి అడుగడుగునా హోటళ్ళు శీతల పానీయాలు తినుబండారాలు.. అందుబాటులో వుండాలి 

ఒక గైడ్ అక్కడ మనకు తగులుతాడు

ఒక గైడ్ మనకు తగులుతాడు 
నిజమో కాదో కానీ 
ఏదో ఒకటి గబ గబా మనకు చెబుతూనే వుంటాడు
ఇది రాణులు జలక మాడిన స్థలం
ఇది రాజుల గుర్రపు శాల 
మనం సగం వినీ వినకా 
ఎండలో చెమటలు కారుస్తూ.. 
ఎందుకొచ్చామ్రా భగవంతుడా అని అప్పుడప్పుడూ మనసులో పశ్చాత్తాప పడుతూ..
ఆయాత్ర యేదో కానిస్తాం




సా యం త్ర మవుతుంది 
తిరిగి బస ..
తిరుగు ప్రయాణం
దీనివల్ల తెలుసుకున్నదేమైనా వుందా..
యేమో..
మేం అక్కడికి వెళ్ళి వచ్చాం 
అని నలుగురికీ చెప్పడానికి తప్ప
మరిచాను ..
సెల్ ఫోన్ లో తిగిన ఫోటో  ల సమ్రంభం ఎలానూ వుంటుంది
ఇలాగేనా టూర్లకు వెళ్ళేది..

మరి మన పుట్టపర్తి గైడ్ అవతారమెత్తితే ఎలా వుంటుంది



మరి మన పుట్టపర్తి గైడ్ అవతారమెత్తి తే ఎలా వుంటుంది .. ?? 
వహ్వా.. తాజ్ ..
అనాలనిపిస్తుంది కదూ..
కానీ పుట్టపర్తి కొన్ని కండీషన్ లు పెడుతున్నారండోయ్
నిజంగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా..?
లేక టైం పాసుకు వస్తున్నారా .. ?
ఇది మొదటి ప్రశ్న
ఇందుకు తయారైన వాళ్ళు మాత్రమే సిధ్ధపడాలి..
అయితే ఆ కండీషన్స్ యేమనుకుంటున్నారు..

''పూర్వ విజయనగరమును జూచుటకు 



పూర్వ విజయనగరమును జూచు టకు 
రెండు సాధనములున్నవి
హంపీకేగిన వెంటనే యొకింత విచారించినచో ..
ఊరుజూపించు కూలీలు (గైడ్ లు) కొందరు దొరుకుదురు..
వారిని నమ్ముకొనిన యెడల ..
మన కాళ్ళ శక్తి కొలది యందందు ద్రిప్పి .. 
యది .. ఇది.. యని చెప్పుచు 
ప్రభుత్వములోని Archaelogical Departmentవారు 
వ్రేల గట్టిన సూచక పఠములకు  (బోర్డ్స్) 
కొన్ని చోట్ల అందునట్లు.. 
కొన్ని చోట్ల అందనట్లు ..
మరికొన్ని యెడల వాటికి 
మన యూహలకు నతీతమగునట్లు ..
నాయా కట్టడముల స్థలముల నిరూపించి 
సాయంకాలమునకు బసకు జేర్చుచు 


సాయం కాలమునకు బసకు జేర్చుచు 
రెండు మూడు దినములలో మన పర్యటనమును ముగింతురు..
(మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా 
మన కొండవీటికి రాజసిం హుడొక్కడే రారాజురా..
ఆ రాజు గాధే ఈ రాజు పాట 
నా పేరే రాజు..
అని వాడు పాడుతూ మనల్ని యాత్ర గావిస్తాడు.. )
వారిపై నాధారపడినవారికి విజయనగరమనిన 
గుండ్లు.. రాళ్ళు .. గుళ్ళు..
గోపురములు .. పాడుపడిన ఇండ్లు..
కోతులు .. కొండముచ్చులు...
మంచి పాలు పెరుగు నున్న యొక ప్రదేశమనిపించును..''

ఫాలో అవుతున్నారా..



ఫాలో అవుతున్నారా 
అదీ సంగతి..

ఇక రెండవ సాధనం..



ఇక రెండవ సాధనం 
పై శాఖవారి కొకప్పుడధ్యక్షుడుగ ఉండిన 
లాంగ్ హర్ట్స్ అనే ఆయన వ్రాసిన పుస్తకము..
అది ఆంగ్లేయ భాషలో వుంది .. 
దాని సహాయంతో పూర్వస్తితి కొంత తెలియగలదు..
కానీ మన సంప్రదాయం తెలియక..
అందులోని పెద్దలను విచారించక.. 
తయారుచేసిన పుస్తకము కావటం వలన
పెడదారి పట్టినదని మా అనుభవము..
మేము అక్కడికి పదమూడుసార్లు వెళ్ళి చూశాము.. 
రెండు సాధనాలనూ పరిపూర్ణముగా వాడుకున్నాం
అందలి పెద్దలతో కొన్ని విషయాలను కూడ ముచ్చటించినాము..

అన్నిటికన్న .. 

ఆ పట్టణమును .. 
సామ్రాజ్జమును నేలిన శ్రీదేవరాయవంశసంభూతులగు నానెగొంది సంస్థానాధీశ్వరుల రా జబంధులిర్వురితో 
పై పెద్దలతో వలె  ముచ్చటిం చుటే కాక .. 
 కొంతకాలమాయా విషయములను గూర్చి చర్చించియుంటిమి.. 
అట్లలవడిన పరిజ్ఞానము ననుసరించి 
ఇందలి పర్యటనక్రమమును సమకూర్చియున్నాము.


పూర్వము విజయనగర తైర్థికులు రైల్వే గైడులు చదువుకొని..
దొరలవలె కమలా పురము చేరి 
యందు బంగళాలో బ్రవేశించి..
దానిలో గా పలాయున్న కింకరుని నమ్ముకొనినచో నణుమాత్రము లాభించదు..

అందున్న నాలుగైదురోజులు సుఖముగ గడుచుటకు 

అ ది మంచి మార్గమే కాని
మునుపటి పట్టణ విషయము తెలుసుకొనుటకది సాధనము కాదు..

మరి .. ??

అందలి కుర్చీలతో .. బల్లలతో .. 
నాగరకతా సూచనలతో కొంత రసభంగమగును..
పాడువడిన పట్టణముల జూడనెంచిన వారు .. 
పాడువడ్డ స్థలములలోనే నివాసమేర్పరచుకొని యున్న 
యొక విధమైన భావముకలిగి .. 
యందలి విషయముల సంగ్రహించుటకు వీలైన మనోగతి యొనగూడును..
సరియగు మనో గతి లేనిదే ఎట్టి విషయమును బోధపడదని మేము చెప్పనక్కరలేదు..

అట్లగుట నటువంటి తైర్థికులందరు 

హంపీలో బస నేర్పరచుకొనుటయే మా మతము
అందు బసచేయుట కనువైన తావులుండునా యని..?? సంశయింపనక్కరలేదు..
శ్రీ విరూపాక్ష శ్వామి తన యాలయములో 
గొన్ని వందల మంది సుఖముగ నివసించుటకు
 వసతు ల నొసంగగలడు..

అది బహిరంగముగ నుండుననుకొనువారికి 

దానినానుకొనియున్న మఠములలో గదులు దొరకును..
కాకున్న 
హంపీ బజారులలోని యిండ్లలో నొకదానిలో బ్రవేసింపవచ్చును..
అట్లు కావించినచో.. 
నెటుజూచినను శిధిల నిర్మాణములు 
సర్వదా కంటబడుచుండును.. 
దానితో యాత్ర కనుకూలమైన మనస్థితి యొదవును..

చూచారా..

మనమొక విషయం తెలుసుకోవాలంటే .. 
ముందు మన మనస్థితిని
ఆ విషయాలకు అనుగుణంగా సిధ్ధం చేసుకోవాలి
అని ఆచార్యులవారు ఎంత ఖచ్చితంగా చెబుతున్నారో..
ఈ గైడ్ మనకు వుండడానికి వసతి కూడా చూపుతున్నాడు .. 
ఇంత బాధ ఎవడు పడతాడ నుకుంటే 
ఎవడో పాశ్చాత్యుడు 
మన విజయ నగర వైభవాన్ని గ్రంధస్తం చేసేస్తాడు  మరి ..
బ్రౌన్ దొర తెలుగు భాషా సేవ చేసినట్లు .. 
సిగ్గుగా అనిపిస్తే మాత్రం ముందుకు నడవండి  .. 
ఆ శ్రమ కోర్వలేనివారు 
చక్కగా యే కాశ్మీరుకో ,,కొడై కెనాలుకో వెళ్ళి 
సేద తీరటం మంచిది..
పుట్టపర్తి వారు ఇంకేం చెబుతారో చూద్దాం..

అట్టి వసతి నేర్పరచుకొన్న వెనుక..
నడ్డగోలుగ నెట నుండియో బయలుదేరి..
యెటో తేలుట కన్న
దొలుత న పట్టణ వాతావరణము నతయు నొక విధముగ మనోదర్పణములో ప్రతిబింబించుకొనుట మంచిది..
దాని కత్యనుకూలమగు సధనయొకటి హంపీలో నున్నది..
హంపీ పర్వతమని యిదివరలో జెప్పియుంటిమి..
ఆ పర్వతములన్నిటిలో నత్యుత్తమ్మైనది..
శ్రీ విరూపాక్షస్వామి కెదురుగ నున్నది..
అది మాతంగ పర్వతము..
దాని నెక్కుటకు పడమర యుత్తరమున దక్షిణమున మూడు సోపాన పంక్తులున్నవి..

అన్నిటిలో నతి శిధిలమైనను..

బశ్చిమ సోపానపంక్తియే యనాయాసముగ నెక్కదగినది..

దానిని బట్టి పైకేగినచో శిఖరముపై నొక దేవాలయమున్నది

ఆ యాలయపు డాబాపై కెక్కి నల్గడల జూచినచో
బూర్వ్ పట్టణవరణమంతయు గనులగట్టినట్లు కాన్పించును..

పుట్టపర్తి గైడ్ డ్యూటీ లోకి వెళ్ళిపోయారు

పదండి ..పదండి..
వారితో పాటు  దర్శించి .. 
మంచి అనుభూతులను మన ఖాతాలో వేసుకుందాం..









15 మార్చి, 2016

కృ ష్ణ గీతం

అది తుంగభద్రా తీరం..
అందులోకి స్నానమాచరించడానికి వెళుతున్నారు పరమాచార్య.
పుట్టపర్తి తో విశేషమైన అనుబంధం..
ఆత్మీయతా 
అక్కడికి వల వల ఏడుస్తూ వచ్చిందో స్త్రీ..
స్వామి వారి పాదాలపై పడింది
స్వమీ చెప్పండి
మా అమ్మ కెందుకిలా జరిగింది..
తుంగభద్రానదిలో నీళ్ళు మౌనంగా కదిలాయి

స్వామి యేమీ మాట్లాడలేదు
మౌనంగా తలేత్తి ఆకాశంవంక చూస్తూ
రెండుచేతులూ చూపించారు
మా అమ్మ కాన్సర్ తో భయంకరంగా చనిపోయిన రోజులు అవి..

శరణాగతి అంటే ఏమిటి
గజేంద్ర మోక్షం లో ఏనుగు మొసలితో పోరాడి పోరాడీలసిపోయి
ఎలా రక్షింపబడటం అనుకుని
ఇటువంటివాడైతే తనని కాపాడగలడని

ఎవ్వనిచే జనించు.. జగమెవ్వనిలోపలనుండు లీనమై
ఎవ్వనియందు డిందు .. పరమేశ్వరుడెవ్వడనాది మధ్య లయుడెవ్వడు
సర్వముదానెయైన వాడెవ్వడువాని నాత్మభవు.. నీశ్వరు
నే శరణంబు వేడెదన్..
అని ప్రార్థించింది

ఈ మొసలి నుంచీ కాపాడు అనికదా దాని ఆంతర్యం..
కానీ దానికి లభించింది కరినుంచీ ప్రాణాలుకాదు
ఏశ్వరునిలో లీనమైపోవడం

ఆయనలో ఐక్యమైతే ఎలా వుంటుందో దానికి తెలియదు
బతికితే హాయిగా మళ్ళీ తన భార్యలతో అడవిలో
శృంగారంలో మునిగిపోతుంది

పరమాత్మ దానినెందుకు అనుగ్రహించాడు
పూజలలో మునిగిపోయి కొందరు
లౌకికంలో మునిగిపోయి ఇంకొందరు
ఉన్నారే
వారినెవరినైనా ఉధ్ధరించవచ్చుకదా..
ఇలా పిలిస్తే నాకు వినబడుతుంది అని
ఇది ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ కావచ్చు

చావు తప్పదని తెలిసిన క్షణంలో
అంతవరకు తాను బ్రదికిన బ్రతుకు గుర్తుకురాదు..
సంభవిమ్హబోయే మరణం ఎంత భయానకమో
తరువాత తానేగతినొందుతాడో..
అన్నదే మనసు నావహిస్తుంది

వెనకనిలబడిన బంధు సమూహంకోసం
తన విలువైన సమయం ఎలా వృధా చేసుకొన్నదీతలచి విచారించటం తప్ప చేయగలిగిందేమీ లేదు..'

వామనుడై వచ్చి
పరమ భక్తుడైన బలి నుంచీ కేవలం మూడడుగులు కోరి
ఎవ్వని గరుణింప నిశ్చయించితిని.. వాని యఖిల విత్తంబునే నపహరింతు
వింధ్యావళికిచ్చిన సమాధానం
అంటే రాటు దేలుస్తాడన్నమాట..

పాల సముద్రంలో పడుకుంటాడంటారు..
తానున్నచోట పాలు వెల్లువలా వుండేటట్లు కృప చేస్తాడంటారు..
ఆవుల పాలు పితికాడంటారు.. 
పాలు వెన్న నెయ్యి దొంగిలించాడంటారు
ఇన్ని పాలు నైవేద్యం పెడితే పొంగిపోతాడంటారు
అటువంటివాడి కథ చెప్పినవాడికీ
విన్నవాడికీపాదములు పట్టినవాడికీ
తల్లిపాలు దొరక్కుండా చేశాడని లీలాశుకుడన్నాడు
అంటే
ఇక తల్లిపాలు తాగ నవసరంలేదనీ

ఇక పుట్టడనీ అర్థం.. 

11 మార్చి, 2016

పామిడి తురగపు పాదము

పామిడి తురగపు పాదము అన్న అన్నమయ్య ప్రయోగంపై జరుగుతున్న చర్చ చూచాను. అన్నమయ్య కీర్తనలకు వ్యాఖ్యాతగా పేర్గాంచిన కామిశెట్టి శ్రీనివాసులు గారిని ఒక మాట అడిగాను
ఇది వారు వెలిబుచ్చిన అభిప్రాయం
ప్రతిదీ వీడియో యేమిటి అనుకోకండి.. 
నాకొచ్చిన విద్య ఇదొక్కటే


8 మార్చి, 2016

ఏకవీర నవల కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి

శ్రీరంగాచార్యులు గారు పుట్టపర్తి గురించి చెప్పిన విశేషాలు..
పుట్టపర్తి ఏకవీర నవలలు కేవలం మూడు రోజులలోనే మళయాళం లోకి అనువదించారట..
ఈ రికార్డింగులో నాకు తోడ్పడిన మా అక్కయ్య నాగపద్మిని కి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు..
శ్రీరంగాచార్యులుగారు తెలంగాణాకు చెందిన పండితులు.. సాహితీవేత్తలు..
పుట్టపర్తి వారితో  అరవైలనుంచీ అనుబంధం కలిగినవారు
వారు పుట్టపర్తిని గూర్చి ఎన్నో విషయాలు నిర్భయంగా విశదంగా మాపై ఎంతో ప్రేమతో వినిపించారు
తమ సొంత పిల్లలాగే మమ్మల్ని చూసిన వారిని పిన్నయ్యా అని పిలవాలనిపించింది..
మా తండ్రిని గురించి ఇన్ని విషయాలు మాకందించిన వారు మాకు పినతండ్రి కాక మరేమవుతారు..


1 మార్చి, 2016

శిల్పాలలో నవరసాలు



శృంగారం హాస్యము కరుణ 
రౌద్రం వీరం భయానకం 
భీభత్సం అద్భుతం శాంతం..
ఇవీ నవరసాలు
నటులు నవరసాలు పలికించటం తెలుసు.. 
మరి శిలలు నవరసాలు పలికించటం విన్నారా.. 
ఈ నల్లని రాలలో .. ఏ కన్నులు దాగెనో .. ఈ బండల మాటున ఏ గుండెలు మొగెనో అన్నది సినిమా పాట 
 కదల లేని మెదల లేని ఆ శిలలు 
ఉలి అలికిడి వినగానే జల జలా భావాలను ప్రవహింప జేస్తాయి .. అని కవి వాక్కు 

'ఎట్లు పైకెత్తిరో..  ఏన్గు గున్నలకైన తలదిమ్ము గొలుపు 
ఈ శిలల బరువు '
అని బాల పుట్టపర్తి ఆశ్చర్యపడ్డారు..

'శిలలు ద్రవించి యేడ్చినవి.. '
కొడాలి సుబ్బారావు గారు 
శిలలకు మనసుంటుందని 
వాని హృదయమూ ద్రవిస్తుందని 
అవి కన్నీరు పెట్టుకుంటాయని చెబుతున్నారు

'ఉలి చేరాలకు చక్కిలింతలిడి ..
ఆయుః ప్రాణములు' శిల్పి పోస్తాడని 
పుట్టపర్తి తన పధ్నాలుగో యేట పెనుగొండలక్ష్మిలో వ్రాసుకుంటే.. 
అబ్బురపడ్డారు రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ వంటి పెద్దలు. 

పుట్టపర్తి పెనుగొండలక్ష్మి లో 
ఇటువంటి అద్భుతమైన వర్ణన లున్నాయి  .. 

మనమూ కొన్ని వందల వేల సంవత్సరాలు 
శిలలై పడివుండి..
ఎవరో మహాత్ముడు మనపై పాదం మోపిన పుణ్యానికి .. మన కర్మ నశించి .. 
జన్మల నడక మొదలై..
ఇదిగో మనిషి వరకూ వచ్చామట..


మరి ఆ శిలల నవరసావిష్కరణ 
పుట్టపర్తి నోటి వెంట వింటే ఎలా వుంటుంది .. 
విజయ నగర సామాజిక చరిత్ర నుంచీ .. 




































విరుపాక్ష స్వామి గోపురములు


విఠలాలయం సమీపం లోనే రాతిరధం వుంది ..
ఇది ఒకే శిల
దీని చక్రాలు తిరుగుతాయి.. కదులుతాయి కూడా..