29 మే, 2017

పలికితి వేదార్థ భావమెల్ల..

శ్రీ గిరిజామనోహర్ గారికి కృతజ్ఞతలతో..
పుట్టపర్తి అనూరాధ

26 మే, 2017

ధ్యానారూఢుడనైన తలపులో..

ఆనందాశ్రులు గన్నులన్ వెడల.. రోమాంచంబుతో..తత్పద 
ధ్యానారూఢుడనైన నా తలపులో..నద్దేవుడుందోచె... నే
నానందాబ్ధి గతుండనై.. యెరుగలేనైతిన్..ననున్నీశ్వరున్..
నానా శోకహమైన యత్తనువు గానన్ లేక.. యట్లంతటన్..
(Telugu bhagavatam.org nunchee)

నా కళ్ళల్లో ఆనందబాష్పాలు పొంగిపొర్లాయి. నా శరీరమంతా పులకించింది. ఆ భక్తి పారవశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు. నేను కన్నులు తెరచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది.



25 మే, 2017

దొరకునా ఇటువంటిసేవ..




శృతిలయలు సినిమా ఫంక్షన్ కడపలో జరిగింద.
విశ్వనాథ్ గారు వచ్చారు. 
మాఅయ్య పుట్టపర్తి ముఖ్య అతిథి. 
ఆ సందర్భంలో జరిగిన విషయం 
కళాతపస్వి ప్రస్థావన వచ్చిన ప్రతిచోటా 
విశ్వనాథ్ గారు చెబుతూనే వున్నారు.

30.10 నిమిషాలకు అయ్యమాట వస్తుంది. 
ఇవన్నీ దాచుకోడం..పెట్టుకోడం అయ్యకు ఇష్టం వుఃడదు.. అయ్యకు తెలీకుండా దొంగ దొంగగా చేయాలి. అందుకే..ఏదో సంశయం..
మీకుతెలుసా..ఆ పద్మశ్రీ అవార్డు 
ఆ పతకం ఎక్కడ పోయాయో.. 
బ్రౌన్ లైబ్రరీ లో వున్నాయేమో..

24 మే, 2017

నాపుణ్యమేమిజెప్పుదు..

కడప రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేస్తూ..
మాఅయ్య సరస్వతీపుత్ర డా.పుట్టపర్తి వారికీ..
కుటుంబ సభ్యులమైన మాకు
ఎంతో ఆత్మీయులైన డా.రేవూరి అనంత పద్మనాభరావు గారు.
 నాకు ఈ ఆర్టికల్ పంపారు.
రేవూరి వారు అవధానాలలో అందె వేసిన చేయి.
 బహు గ్రంథ కర్త.
మీదుమిక్కిలి పుట్టపర్తి వారికి చేరువైనవారు.

 ఇదివరలో స్వర్గీయ శ్రీశైలం గారు
అయ్య అభిమాని..
ఎన్నో పేపర్ కటింగ్స్..
అయ్యవి భద్రపరచి నాకు అందజేశారు.

వానిని నా బ్లాగ్ లో ప్రచురించడం జరిగింది..
ఇప్పుడు అనంతపద్భనాభరావుగారు
నన్ను గుర్తు పెట్టుకుని ఆర్టికల్ పంపారు.
వారిపై నున్న భక్తి భావంతో దీనిని తిరిగి ప్రచురిస్తున్నాను.


18 మే, 2017

పుణ్యంబై..మునివల్లభ గణ్యంబై..


ఒక కొడుకు తనను వీడిపోయాడు
అదీ తనవల్ల
కారణం తనకు ధర్మబధ్ధమే
కానీ పర్యవసానం అతి ఘోరం
మనసు దహించుకుపోతోంది..
స్వాంతన కావాలి
ముగ్గురు భార్యలు
ఒక్కోరిదీ ఒక్కో పంధా..
చిన్నదని ముద్దు చేసిన మూడవ భార్య తన నిస్సహాయతను అడ్డంపెట్టుకుని
కోరరాని కోరిక కోరింది..
ఇచ్చిన మాట వలన తను నిస్సహాయుడు

ఫలితం ..
ముక్కుపచ్చలారని కొడుకు అడవులు పట్టిపోవలసివచ్చింది
ఇక మిగిలిన ఇద్దరు భార్యలు ప్రజలు అధికారులు అందరు తనని అపరాధిగా చూస్తున్నారు
తన ఆత్మే తనని చిత్రవధ చేస్తూంది
కొడుకు కోడలు పసిపిల్లలు వట్టికాళ్ళతో నడచివెళ్ళారు
ఇంకో కొడుకు అన్నకు అండగా వెళతానని పోయాడు
అతని భార్య చేసేదేమీలేక దీర్ఘ నిద్రను ఆశ్రయించింది
అన్నీ తనవల్లే..
ఇంతకీ తన తప్పేమిటి
సత్య సంధత ధర్మ పాశానికీ సత్యపాశానికీ కట్టుబడిన నేరం తనది
సత్యం ధర్మానికీ కట్టుబడటం తప్పెలా అవుతుంది

కుమిలి కుమిలి పలవరిస్తూ కళ్ళుమూసాడు
నలుగురు కొడుకులున్న ఆయనను అంతిమ సంస్కారాలు చేయడానికి ఒక్కడూ లేడు
ప్రేతసంస్కారం జరపడానికి వీలులేని ఆ శరీరాన్ని నూనె తొట్టిలో పెట్టవలసివచ్చింది..


ఇది దశరధ పాత్ర.
ఇలాంటి ఎన్నో సంఘర్షణల కలయిక రామాయణం.

ఇంత అద్భుత సృష్టి గురించి 
మిగిలిన  మహాకవుల స్పందన ఎలా ఉండేది .. 
ఇవి మనకెవరు చెబుతారు .. 
పుట్టపర్తి తప్ప .. 

ఏ ముహూర్తంలో వాల్మీకి రామాయణ రచన ఆరంభించినాడో ..
అందరికీ దాని పైననేకన్ను..

గత దశాబ్దాలలో కొందరు పాశ్చాత్యులు 
 రహస్యంగా మత దురభిమానం ఎక్కడో పని చేసేవారు
తమ గ్రంధాలతో రామాయణాన్ని పోల్చి చూడటానికి 
వ్యర్థ ప్రయత్నాలు చేశారు
కానీ అవి వ్యర్థాలుగానే మిగిలిపోయాయ్ 

వారు కూడా కడకు రామాయణ కవిత్వానికి 
తలవంచక తప్పదు
రష్యా దేశంలో సుమారు ఇరవైయేండ్లనుంచీ 
కొన్ని నూర్ల సార్లు రామాయణం నటింపచేశారట.

ఇంకా వారి హృదయాలు రామాయణచాపల్యాన్ని వదలలేదని 
వాళ్ళ వ్రాతలే చెబుతున్నాయి
కవిత్వం వరకూ పోకుండానే
కేవలం కథయే వారి దృష్టిని ఎంతో ఆకర్షించింది

రాముని పితృవాక్యపరిపాలనా
ఏకపత్నీవ్రతమూ
భ్రాతృప్రేమ
ఇలాంటి గుణాలే వారిని సమ్మోహితుల్ని చేశాయి

ఇక భారతీయులకు రామాయణమంటే నిత్యదాహం
దేశ భాషల్లో ఎందరో
 రామకథను వ్రాసుకుంటూ వచ్చినారు
రామకథాకారుల్లో పరమభక్తులై 
భగవత్సాక్షాత్కారం పొందినవారున్నారు
మహారాష్ట్రలో పండరీనాధుణ్ణి సాక్షాత్కరించుకున్న ఏకనాథుడు
భావార్థరామాయణం రాసినాడు
అవధీభాషలో తులసీదాసు రామకథను పాడినాడు
అతడు రామభక్తాగ్రేసరుడు
తమిళంలోని కంబరామాయణం చాలా ప్రసిధ్ధమైనది
మళయాళంలో ఎజుత్తచ్చెన్ రామాయణ కర్త.
వీరంతా కూడా భగవదనుభూతి కల్గినవారే.

వీరే కాక కావ్యరచనా దృష్టితో రా మకథను చేపట్టినవారెందరో
కన్నడంలో రెండు మూడు రామాయణాలున్నాయి
ఇక తక్కిన భాషల్లోను లేకపోలేదు
జైన రామాయణాలూ కొన్ని
విదేశీయ రామాయణాలూ కొన్ని.
తెలుగు కన్నడాలలో మొన్న మొన్న కూడా ఏదో శిల్పమని పేరుపెట్టి
రామకథను కొత్తరంగులు పూసిన వారున్నూ లేకపోలేదు

కానీ
 ఎవరెన్ని వ్రాసినా ఇవన్నీ 
వాల్మీకి రచనా కౌశలమ్ముందు పిల్లి మొగ్గలే అయిపోయినాయి

సావిత్రి వంటి మహాకావ్యాన్ని వ్రాసిన అరవిందయోగికి కూడా 
వాల్మీకి వంటి రచన చేయలేకపోయానే అనే నిరాశ.

ఇక సంస్కృత కవులందామా
ప్రతి ఒక్కరికి రామాయణం పైననే కన్ను
ఇది ఒక అమృత సముద్రం
సంస్కృతకవులలో అనేకులు ఆ సముద్రానికి దూరంలోనే నిలిచి నమస్కారం చేసినారు
కొందరు గట్టువరకు పోయి నిలబడినారు
కొందరు ఏవో చిన్న చిన్న మునకలు వేసినారు

ఉత్తర రామ చరిత్ర చూస్తే ఒక్కొక్కసారి నా దృష్టికి రామాయణాన్ని పూర్తిగా జీర్ణించుకోలేకపోతినే
అని భవభూతి పడిన వేదనగానే అర్థమవుతుంది


ఒక భవభూతి యేమిటి ..
అలా మథన పడిన వారెందరో ఉన్నారు. 

15 మే, 2017

వ్యాఖ్యాన వైఖరి

జిన కంచి  గురించిన వివరాలు .. 
http://www.thehindu.com/thread/arts-culture-society/article8179948.ece

12 మే, 2017

పరమ భాగవతుల పాదసేవ .. (పుట్టపర్తి కీర్తి శిఖరాల మాట గరికపాటి నోట..)


నవజీవన వేదంలో  
గరికపాటి నోట సరస్వతీ పుత్ర పుట్టపర్తి 
ప్రస్తావన వచ్చింది. 

ఈ కాలంలో నాలుగు అవధానాలు చేసినా... 
నాలుగు ప్రవచనాలు చెప్పినా 
అతణ్ణి సరస్వతీ పుత్రుడు ..
వాణీ పుత్రుడు.. 
శారదా జ్ఞాన పుత్రుడు అంటూ బిరుదాలు ఇచ్చి పరవశిస్తూ వుంటారు..
 వారి పేరు ముందా బిరుదు వారికి వన్నె తెస్తుందేమో 
కానీ ఆ బిరుదానికే వన్నె వచ్చేది 
అది తగినవ్యక్తి చెంత చేరినప్పుడు మాత్రమే..  


నిజానికి ఈ సరస్వతీపుత్ర బిరుదము 
ఎక్కడో హిమాలయాలలో 
తత్త్వ శోధన చేస్తున్న 
మౌని జ్ఞాని తపస్వి అయిన 
స్వామి శివానంద సరస్వతుల వారిచే 
పుట్టపర్తి వారికి 
పదునాల్గు భాషలలో పాండిత్యాన్ని 
బాగా పరీక్షించిన తదుపరి 
ఆనంద పరవశులై ప్రదానం చేయడం జరిగింది.

పుట్టపర్తి వారు  దేశంలోని 
అనేక కవులు  యోగులు అవధూతలు 
మొదలైన వారిని కలుస్తూ.. 
భగవదన్వేషణలో 
జీవితంపై విరక్తి చెంది పర్యటిస్తూ 
తనకు తృప్తి కరమైన సమాధానం దొరకని కారణంగా విసిగి వేసారి  ప్రాణత్యాగానికై 
ఆ మంచు కొండలనెక్కారు. 

వెంటనే స్వామి శివానంద ద్వారా 
వారి అన్వేషణకు ఒక సమాధానం దొరికింది.
 పుట్టపర్తి వారిని స్వామివారు తమ ఆశ్రమంలో 
కొన్ని నెలలు వుంచుకుని అన్ని శాస్త్రాలలోనూ 
వారి పాండితికి సంతుష్టులై 
'సరస్వతీపుత్ర '
అనే బిరుదాన్ని శిష్యవాత్సల్యంతో ఇచ్చారు..

నాకీ బిరుదులు యేమీ వద్దు 
ఎన్ని కోట్ల నామజపం చేసినా 
ఎటువంటి అనుభూతి కలుగలేదు..
 ఎందుకు అన్న ప్రశ్నకు సమాధానం కావాలి 
అని పుట్టపర్తి నివేదించగా 

'నీకు నీ జీవిత అంత్యకాలంలో కృష్ణ దర్శనమౌతుంది' అని వాగ్దానం చేసారు. 
అదే వాగ్దానాన్ని కంచి పరమాచార్యులైన 
నడిచేదైవం అని పేర్గాంచిన 
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతులవారు 
పుట్టపర్తికి మళ్ళీ ఇచ్చారు..

శివానందుల వారు నీవు నాపైని అభిమానంతో 
ఈ బిరుదాన్ని స్వీకరించవలసింది అని కోరారట.
అంత గంభీరమైన ఉదాత్తమైన నేపధ్యం కలిగినదీ సరస్వతీపుత్ర అనే బిరుదం.. 
తరువాతి కాలంలో 
పుట్టపర్తి వారిని ఎన్నో బిరుదాలు వరించినా అవి అక్కడే మర్యాద పూర్వకంగా తిరిగి ఇచ్చివేసిన సందర్భాలు వున్నాయి పుట్టపర్తి వారి జీవితంలో.. 

కానీ పరమ యోగి పుంగవులైన 
స్వామి శివానందులవారిపై గౌరవంతో 
ఒక్క సరస్వతీపుత్ర అన్న బిరుదాన్ని మాత్రం 
వారు తమ పేరులో వుంచుకోవటం జరిగింది.

అప్పటినుంచీ అది పుట్టపర్తి వారికి మరింత శోభనద్ది తనను తాను శోభితం చేసుకుంది.
ఇదే విషయాన్ని మహా సహస్రావధాని గరికపాటివారు వివరించారు.. 
సరస్వతీపుత్ర ఆంద్ర దేశం లో ఒక్క పుట్టపర్తి నారాయణాచార్యులు వారికే వుంది 
ఇంకెవ్వరికీ అది శోభించదు ,
అంటూ వాక్రుచ్చారు .. 

-పుట్టపర్తి ప్రియపుత్రిక పుట్టపర్తి అనూరాధ భక్తి పూర్వక సమర్పణ.

10 మే, 2017

రాయల రాజభక్తి

krishnadevaraya childhood కోసం చిత్ర ఫలితం
రాజులకాలంలో 
రాజు కొడుకే మళ్ళీ పాలనాధికారాలు చేపట్టేవాడు..
చిన్నప్పటినుంచే గుర్రం స్వారీ.. ఖడ్గ చాలనం వంటి ఎన్నో విద్యలు నేర్పించేవారు
తండ్రిని చూసే పాలనాదక్షత రాజకీయపుటెత్తుగడలు ప్రజాపాలన మొదలైనవి ఫాలో అయిపోయ్యేవాళ్ళు

మరిప్పుడు ప్రజాస్వామ్యం
అయిదేళ్ళకోపారి ఎన్నికలు..
ప్రజలెన్నుకున్నవాడే నేత...
కానీ మనకలా అనిపిస్తుందా ..
కె సీ ఆర్ కొడుకే కాబోయే ముఖ్యమంత్రి..
చంద్రబాబు బాబే మనకు కాబోయే మరో బాబు..
పధ్ధతి మారింది కానీ అంతా సేం టు సేం..

 ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడం తొక్కిపెట్టటం..రిగ్గింగ్ రెండుసంవత్సరాలముందే రాబోయే ఎన్నికలకు జనాల నెలా బుట్టలో పడేసుకోవాలి 
అనే అంశాలమీద తర్ఫీదునిప్పిస్తున్నారు..

మన సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయలవారు తన ఇరవయ్యవయేట రాజ్జాధికారాన్ని చేపట్టి
అంధ్ర భోజునిగా
కన్నడ రాజ్య రమా రమణునిగా
కీర్తించబడి..
గొప్ప రాజనీతిజ్ఞునిగా..సైనికాధికారి భుజబల సంపన్నుడు ఆర్థికవేత్త వ్యూహ నిపుణుడు..పట్టినపట్టు విడువనివాడు
అంతే కాదు
కవిపోషకుడు.. సాహితీ సమరాంగణ సార్వభౌముడు గా నుతింపబడ్డాడు..
మరి ఈయన తన వారసుణ్ణి తన తర్వాత రాజుగా చూసుకున్నాడా..
ఇందులో కొన్ని సందేహాలు
మనచరిత్ర అంతా యే పోర్చుగీసు వాడో.. 
లేకపోతే మనల్ని పాలించి పోయిన బ్రిటిషు వాడో చెబితే తెలుసుకోవలసిన దుస్థితి..

వాళ్ళలో ఒకడైన న్యూనిజ్ 
మన రాయల పాలనా వైభవాన్ని పరాయి దేశస్తుడైనా కళ్ళకు కట్టినట్టు చూపించాడు


1346 లోని యొక శాసనమిట్లున్నది..
'' మహామండలేశ్వర భాషగె రాయరగండ హిందూసురత్రాణ, శ్రీవీర అరియప్ప వడయరు బుక్కప్ప వడయరు రాజ్యపాలన్ చేస్తుండంగాను..''

తమిళములోనే మరియొకటి యిట్టిదే గలదు..
హరియప్ప బుక్కణ్ణ లిర్వురును జేరి 
తెక్కల్ నాడు లోని జనులకిచ్చిన యాజ్ఞాపత్రమది..

1386 లో గూడ 
హరిహర బుక్కల సమిష్టి పాలనము దెల్పు శాసనము గద్దు..
దేవరాయల సుతుడైన విజయ రాయుడును 
దండ్రి కాలముననే సహాయ సం రక్షకుడుగ నున్నట్లు శాసనములున్నవి..

అట్లే..
విజయరాయసుతుడైన రెండవ దేవరాయుడు గూడ
ఇతడు వీర విజయ రాయల సహాయ సమ్రక్షకుడుగ పనిజేసెను..

విరూపాక్ష రాయలును దన కుమారునితో గలసి రాజ్యపాలన మొనర్చినట్లు శాసనాధారములుగలవు..

ఇంతలో సాళువ నరసిమ్హుడు సిమ్హాసనము నాక్రమించెను..

కృష్ణదేవరాయలుగూడ దన కుమారుడైన తిరుమలునితో జేరి సమిష్టి పాలన మొనర్చెనేమో..
ఈ విషయమును ధ్రువపరచు 
1524 లోని యొక దాన శాసనము గలదు..

దానివిషయమిది.
'' తిమ్మరుసు 
గృష్ణదేవరాయల కాయురారోగ్యములు బ్రాప్తించుటకై.. గొన్ని పల్లెలపైని సుంకమును
 'మాగడీ లోని తిరువేంకటేశ్వరునకు సమర్పించెను..
ఈ సుంకములా దేవుని భూషణసేవకు..

తిమ్మణ్ణ ధన్నాయకుడను మరియొక యుద్యోగి తిరుమల రాయని నిరంతరాభివృధ్ధికి  
మరికొన్ని సుంకముల నా దేవునికే యొసగెను..

కృష్ణ దేవరాయడు దన కొడుకుతో జేరి పరిపాలనమును కొన్ని దినములు సాగించెనని
న్యూనిజ్ వ్రాతగూడ నున్నది..
పైశాసనమావ్రాతకు దోడ్పాటు..

కృష్ణదేవరాయల కుమారునిపేరేమో 
న్యూనిజ్ వ్రాయలేదు ..
తురుష్కులపై విజయమును సాధించిన తరువాత రాయలేమి చేసెనో యాతడిట్లు దెలిపెను.

'వృధ్ధాప్యమున దాను విశ్రాంతి గైకొనవలెనని 
రాయల యాశ.
తన యనంతరము
 గుమారుడు సిం హాసనము నెక్కి పరిపాలింపవలెనని వేరొక యాకాంక్ష.

ఈ రెండు కోరికలను సాధించికొనుటకు 
బూర్వ రంగమున దాను బ్రతికియుండగనే 
వానిని రాజుగ నొనర్చుటకు రాయలు సంకల్పించెను
అప్పటికి గుమారుని వయస్సు 
ఆరు సంవత్సరములు మాత్రమే..

తన యనంతరము పరిస్తితులెట్లుండునో యని యనుమానించి రాయలు గుమారునకు బట్టాభిషేకమొనర్చెను..
తన యధికారములన్నియు వానికి గట్టబెట్టినాడు..
సిం హాసనము నప్పగించెను..

తాను మహాప్రధానియైనాడు..
తిమ్మరుసు మహామంత్రికి సలహాదారుడు..

కృష్ణరాయల రాజభక్తి యెంతవరకు వచ్చెననగా..
సిం హాసనాధిష్టుడైన కుమారుని యెదుట 
నాతడే మోకరిల్లుచుండెనట..
పట్టాభిషేకమహోత్సవములు 
సుమారెనిమిదినెలలు సాగినవి..
ఈ వేడుకలలోనే .. 
చిన్నరాజుకు జబ్బువచ్చి మరణించెను..''

అదే న్యూనిజ్ మరియొక చోట 
''కృష్ణరాయ సుతుని వయస్సు పదునెనిమిది నెలలు మాత్రమే నన్నాడు అతని వ్రాతలలోననేక చోటులనిట్టి వ్యాఘాతములు దగులుచుండెను..''
అదీ సంగతి .. 
 రాచరికపు రాజకీయాలు .. 
సొంత తమ్ములు... సవితి తమ్ములు.. 
చిన్నాయన  పెదనాయన పిల్లలు.. 
చంపడాలు బందీలుగా చేసి మగ్గబెట్టడాలు .. 
ఎన్ని పన్నాగాలో.. 
అందులోనూ 

వారసులను కాపాడే రాజభక్తులు 
వేరేచోట పెంచి పెద్ద చేసి .. 
ఆఖరికి పుట్టుమచ్చలాంటి ఋజువు లు చూపి రాజును చేసేయడాలు  .. 
అన్నీ మనం సినిమాలలో చూసేసాం .. 
ఆ పసివానిముందు మోకరిల్లిన 
రాయల రాజభక్తి మన కట్టప్పనుపోలి లేదూ..